Pandu Master emotional video: ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ ‘ డ్యాన్స్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్న పండు మాస్టర్ , రీసెంట్ గానే రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రమైన గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక ఈవెంట్ ని ముగించుకొని తిరిగి వస్తుండగా , ఈ ఘోరం జరిగింది. అయితే సమీపం లో ఉన్న స్థానికులు వెంటనే పండు మాస్టర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్చి , మెరుగైన వైద్యం అందించడం తో , పండు మాస్టర్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. అయితే ఆయన అభిమానులు , ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియకపోవడం కాస్త కంగారు పడ్డారు. సోషల్ మీడియా లో పండు మాస్టర్ ని ట్యాగ్ చేస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే కాసేపటి క్రితమే పండు మాస్టర్ ఒక వీడియో ని విడుదల చేశాడు .
ఈ వీడియో లో పండు మాస్టర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి , అదే విధంగా తనకు ప్రమాదం ఎలా జరిగింది? అనే అంశం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒక ఈవెంట్ ని ముగించుకొని , కార్లో తిరిగి వస్తున్న సమయం లో నాకు అనుకోకుండా వామిటింగ్స్ ఫీలింగ్ వచ్చింది. దీంతో కారుని రోడ్డు పక్కన ఆపాము. ఈలోపు ఒక వాహనం అతి వేగంగా వచ్చి మా కారుని ఢీ కొట్టింది. పక్కనే ఉన్న నాకు దెబ్బలు తగిలేలోపు అక్కడిక్కడే స్పృహ తప్పి క్రింద పడిపోయాను , మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నాను. నా రెండు కాళ్లకు చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ముఖ్యంగా హిప్ జాయింట్ దిస్ లొకేట్ అవ్వడం వల్ల, కింది భాగం లో ఎముకలు , జాయింట్లు బాగా దెబ్బ తిన్నట్టు డాక్టర్లు గుర్తించారు’.
‘హాస్పిటల్ లో నాకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత , ఒక మేజర్ సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పడం తో , ఆ సర్జరీ ని కూడా విజయవంతంగా చేయించుకున్నాను. ప్రస్తుతానికి నా ఆరోగ్యం స్థిరంగానే ఉంది. కాకపోతే పూర్తి స్థాయిలో కోలుకొని మీ ముందుకు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈ కష్టమైన సమయం లో నాకు తోడుగా ఉంటూ , నేను కోలుకోవాలని ప్రార్థించిన మిత్రులు , అభిమానులు శ్రేయోభిలాక్షులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను ‘ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు పండు మాస్టర్. కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో , సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలవ్వడం , పాపం నిజంగా పండు మాస్టర్ చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి.

