Tenant OTT: ఓటీటీలో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్… పొలిమేర హీరో నుండి అదిరిపోయే మూవీ!

రీసెంట్ గా సత్యం రాజేష్ ' టెనెంట్ ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పైయ్యాపుల హీరోయిన్లుగా నటించారు. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు.

Written By: S Reddy, Updated On : June 8, 2024 6:51 pm

Tenant OTT

Follow us on

Tenant OTT: కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు సత్యం రాజేష్. సుమంత్ హీరోగా తెరకెక్కిన సత్యంలో కీలక రోల్ చేశాడు. ఆ మూవీ హిట్ కావడంతో తన ఇంటి పేరుగా మారిపోయింది. కామెడీ, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాకుండా హీరోగా పొలిమేర సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. చేతబడి, క్షుద్ర పూజల నేపథ్యంలో వచ్చిన మా ఊరి పొలిమేర ఓటీటీ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. గత ఏడాది వచ్చిన పొలిమేర 2 సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక రీసెంట్ గా సత్యం రాజేష్ ‘ టెనెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పైయ్యాపుల హీరోయిన్లుగా నటించారు. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ టెనెంట్ ‘ స్ట్రీమ్ అవుతుంది.

ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే … గౌతమ్, రిషి ఇద్దరూ టెనెంట్స్. గౌతమ్ తన మరదలు సంధ్యను పెళ్లి చేసుకుని హైదరాబాద్ వస్తాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోకుండా విబేధాలు వస్తాయి. సంధ్య అనూహ్యంగా హత్యకు గురవుతుంది.

అదే రోజు గౌతమ్ పక్క ఫ్లాట్ లో ఉండే రిషి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. రిషిని ప్రేమించిన వైష్ణవి కనిపించకుండా పోతుంది. సంధ్య ను హత్య చేసినందుకు గౌతమ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నిజంగానే సంధ్యను గౌతమ్ హత్య చేశాడా? రిషి ఇంకా సంధ్యకు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసు వెనుకున్న మిస్టరీని ఏసీపీ? ఎలా కనిపెట్టారు అన్నది కథ.