రచయిత మారిన ప్రముఖ హీరోయిన్

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో సినీ సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోయిన్లు వాళ్లకు అమ్మలకు వంటింట్లో సాయం చేస్తున్నారు. మరికొందరు కొత్తకొత్త వంటకాలను తయారుచేసే పనిలో పడ్డారు. పలువురు హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వేసవిలో మరింత హీట్ ను పెంచుతున్నారు. పలువురు హీరోయిన్లు ఫిటెనెస్, యెగా వంటిపై దృష్టిసారిస్తున్నారు. ఇక హీరోలైతే తమ ఫ్యామిలీ, పిల్లలతో కాలక్షేమం చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను […]

Written By: Neelambaram, Updated On : April 6, 2020 4:43 pm
Follow us on


లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో సినీ సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోయిన్లు వాళ్లకు అమ్మలకు వంటింట్లో సాయం చేస్తున్నారు. మరికొందరు కొత్తకొత్త వంటకాలను తయారుచేసే పనిలో పడ్డారు. పలువురు హీరోయిన్లు సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వేసవిలో మరింత హీట్ ను పెంచుతున్నారు. పలువురు హీరోయిన్లు ఫిటెనెస్, యెగా వంటిపై దృష్టిసారిస్తున్నారు. ఇక హీరోలైతే తమ ఫ్యామిలీ, పిల్లలతో కాలక్షేమం చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ పోస్టు చేస్తుండటం చూస్తున్నాం.

వీరిందరిని తలదెన్నేలా మలయాళ భామ నిత్యామీనన్ తన టాలెంట్ తో మరోసారి ఆకట్టుకుంది. లాక్ డౌన్ వల్ల ఖాళీగా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలోని మరో టాలెంట్ కు పదునుపెడుతోంది. బహుభాషా నటిగా, సింగర్ గా అలరించిన నిత్యామినస్ తాజాగా రచయితగా మారింది. తనలోని వచ్చే ఆలోచనలను స్క్రీప్ట్ రూపంలో బయటికి తీసుకొస్తుంది. అలాగే కొత్త భాషను, మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు నిత్య తెలిపింది.

కరోనా మహమ్మరి వల్ల ప్రస్తుతం అందరం ఇంట్లో ఉండం అవసరమని నిత్య మీనన్ తెలిపింది. దేశంలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా మనం మన పనుల్లో బీజీగా అవడానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. ఈ ఖాళీ సమయాన్ని తాను పెన్ను పెట్టి ఇలా కథలు రాయడానికి వాడుకుంటున్నానని తెలిపింది. ఇప్పటివరకు అందం, అభినయంతో అలరించిన నిత్యమీనన్ రానున్న రోజుల్లో రచయితగా కూడా అలరించనుంది. మరోసారి నిత్య మీనన్ మల్టిటాలెంటెడ్ అని మరోసారి నిరూపించింది.