Homeఎంటర్టైన్మెంట్Nitya Menon: ప్రభాస్​ విషయంలో నా గురించి అలా రాయడం చాలా బాధేసింది- నిత్యా మేనన్​

Nitya Menon: ప్రభాస్​ విషయంలో నా గురించి అలా రాయడం చాలా బాధేసింది- నిత్యా మేనన్​

Nitya Menon: అలా మొదలైంది సనిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే ఫిల్మ్​ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ నీత్యా మేనన్​. హీరోయిన్​గానే కాకుండా, సింగర్​గానూ తన టాలెంట్​తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, మధ్యలో సడన్​గా కెరీర్ మంచి ఫామ్​లో ఉండగా.. అనుకోకుండా కాస్త గ్యాప్​ తీసుకుంది నిత్య . మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్​ కళ్యాణ్​ గీరోగా నటిస్తోన్న భీమ్లానాయక్​లో నటిస్తోంది నిత్యా. దీంతో పాటు విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్​లోనూ నటించింది. ఇటీవలే ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను అకట్టుకుంటోంది.

nithya-menen-says-the-prabhas-issue-to-mental-troubled

ఈ సినిమాతో నిత్యా కేవలం హీరోయిన్​గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది నిత్య. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన నిత్య.. తనకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బే తగిలింది ఒక్క ప్రభాస్​ విషయంలోనే.. ఆ విషయం ఇంకా నన్ను మానసికంగా బాధపెడుతూనే ఉంది. నా గురించి ఓ జర్నలిస్ట్ అలా రాయడంతో చాలా బాధేసింది. అలా మొదలైంది సినిమా నాకు తొలి సినిమా.. ఫిల్మ్​ ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగుపెట్టా.. కాబట్టి నాకు పెద్దగా తెలేదు.. తెలుగు సినిమాలు కూడా చూడలేదు. అప్పుడు ప్రభాస్​ గురించి అడిగితే నాకు తెలియదన చెప్పా. ఆ విషయాన్ని చాలా పెద్దది చేసి చూపించారు. నేనేదో తప్పు చేసినట్లుగా న్యూస్​ క్రియేట్​ చేశారు. అని చెప్పుకోచ్చారు. అప్పటి నుంచే అన్ని చోట్లా నిజాయితీగా ఉండకూడదని..మాటల గారడే అందరికి కావాలని అర్థమైందని అన్నారు నిత్య.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version