Homeఎంటర్టైన్మెంట్‘కార్తికేయ 2’ కోసం నిఖిల్ అంత సాహసం చేస్తాడా?

‘కార్తికేయ 2’ కోసం నిఖిల్ అంత సాహసం చేస్తాడా?


కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేటర్లు మూత పడడంతో పూర్తయిన సినిమాల విడుదల కూడా వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మినహాంపులు ఇచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణలో షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చిత్ర పరిశ్రమకు కాస్త ఊరట కలిగింది. ముఖ్యంగా చిన్న ఆర్టిస్టులు, రోజువారీ వేతనంతో పని చేసే కార్మికులు పని దొరుకుతుందని ఉత్సాహంగా ఉన్నారు. అయితే, గవర్నమెంట్ అనుమతి ఇచ్చినా.. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి షూటింగ్స్ మొదలు కావడానికి కొంత సమయం పడుతుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఏదేమైనా అనుమతి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరిలో మాత్రం ఆందోళన ఇంకా తగ్గలేదు. ఎందుకంటే తమ కథ డిమాండ్ ప్రకారం కొంతమంది దర్శక, నిర్మాతలు విదేశాల్లో షూటింగ్స్ ప్లాన్ చేశారు. ఆ జాబితాలో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘కార్తికేయ 2’ మూవీ ఒకటి. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. కార్తికేయకు సీక్వెల్. నిఖిల్, స్వాతి కాంబినేషనల్‌లో వచ్చిన ఆ మూవీ ఘన విజయం సాధించించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ మొత్తాన్ని ఇండియాలోనే చిత్రీకరించారు. కానీ, ‘కార్తికేయ 2’ కథ ప్రకారం మూవీలో కీలక భాగాన్ని కంబోడియా దేశంలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అనుమతుల కోసం చందు అండ్‌ కో ఆ దేశం వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే, మన దేశంలో ఇంకా లాక్‌డౌన్‌ ముగియలేదు. పైగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం ఉంది. దాన్ని ఎప్పుడు ఎత్తి వేస్తారో తెలియదు. ఒకవేళ ఎత్తి వేసినా… ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న టైమ్‌లో ఇతర దేశాలకు వెళ్లడం ఎంత వరకు భద్రమో తెలియదు. ఈ పరిస్థితుల్లో చిత్ర యూనిట్‌తో కలిసి నిఖిల్ కంబోడియా వెళ్లే సాహసం చేస్తాడా? చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version