Nayanthara: రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నయనతారా.. ఇన్ స్టాలో ఫొటో షేర్‌చేసి..

ఇటీవలే నయనతారా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న తన భర్తకు ప్రేమను వర్ణిస్తూ విషెస్‌ కూడా చెప్పారు. కానీ శనివారం విఘ్నేష్‌ను అన్‌ఫాలో చేసింది.

Written By: Raj Shekar, Updated On : March 3, 2024 4:09 pm

Nayanthara

Follow us on

Nayanthara: తమిళ లేడీ సూపర్‌స్టార్‌ నయనతారా తన భర్త విఘ్నేష్‌ శివన్‌ను అన్‌ఫాలో చేయడం రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు. దీంతో నయనతార ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు.

ఏం జరిగిందంటే..
ఇటీవలే నయనతారా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న తన భర్తకు ప్రేమను వర్ణిస్తూ విషెస్‌ కూడా చెప్పారు. కానీ శనివారం విఘ్నేష్‌ను అన్‌ఫాలో చేసింది. ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. దీంతో నెట్టింట రకరకాల రూమర్స్‌ మొదలయ్యాయి. దీంతో గందరగోళం నెలకొంది.

చెక్‌ పెట్టిన నయన్‌..
ఈ గందరగోళానికి నయన్‌ చెక్‌ పెట్టారు. సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని ఆమె ఇన్‌స్టాలో మళ్లీ పోస్టు పెట్టారు. అయితే కొన్ని మీడియా సంస్థలు వీళ్లు విడిపోతున్నారంటూ ప్రచారం చేశాయి. వాటికి నయన్‌ చెక్‌ పెట్టేశారు. తిరిగి విఘ్నేశ్ఃను ఫాలో అవుతున్నారు. అలాగే విఘ్నేష్‌ ఫొటోను తన ఇన్‌స్టాలో స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో ఈ వ్యవహారానికి ముగింపు