Nara Rohit : పొలిటికల్ థ్రిల్లర్ తో నారా రోహిత్ రీఎంట్రీ… ట్విస్ట్ ఏంటంటే డైరెక్టర్ ఓ జర్నలిస్ట్! 

ఈ చిత్ర దర్శకుడు టీవీ 5 మూర్తి అంటున్నారు. ఈ మేరకు విశ్వసనీయ ప్రచారం జరుగుతుంది. జర్నలిస్ట్ అయినప్పటికీ అందరికీ సుపరిచితుడే. ఆయన దర్శకుడిగా మారుతున్నాడన్న న్యూస్ సంచలనం రేపుతోంది.

Written By: Shiva, Updated On : July 23, 2023 11:07 am
Follow us on

Nara Rohit : మాజీ సీఎం నారా చంద్రబాబు  నాయుడు తమ్ముడు కొడుకైన నారా రోహిత్ 2009లో నటుడిగా అరంగేట్రం చేశాడు. బాణం ఆయన డెబ్యూ మూవీ.  దర్శకుడు పరశురామ్  తెరకెక్కించిన సోలో మూవీతో హిట్ కొట్టాడు. తర్వాత చాలా ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు. 2018లో బ్రేక్ తీసుకున్నాడు. ఆయన చివరి చిత్రం వీరభోగ వసంతరాయలు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మూవీ ప్రకటించారు. నారా రోహిత్ 19వ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. 

 
ఈ చిత్ర ఫస్ట్ లుక్ 24న విడుదల చేయనున్నారు. ఒకడు అన్ని అడ్డంకులను ఎదిరించి నిలిచాడు అని క్యాప్షన్ పెట్టారు. న్యూస్ పేపర్స్ తో డిజైన్ చేతిని కాన్సెప్ట్ పోస్టర్ గా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వానర ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. దర్శకుడిని మాత్రం ప్రకటించలేదు. అయితే ట్విస్ట్ ఏంటంటే… ఈ చిత్ర దర్శకుడు టీవీ 5 మూర్తి అంటున్నారు. ఈ మేరకు విశ్వసనీయ ప్రచారం జరుగుతుంది. 
 
టీడీపీ అనుకూల మీడియా సీఎం జగన్ విమర్శించే ఛానల్స్ లో టీవీ 5 ఒకటి. ఈ ఛానల్ లో పనిచేసే మూర్తి మీద వైసీపీ వాళ్ళు మండిపడుతుంటాడు. ట్రోల్స్ చేస్తుంటారు. ఆ విధంగా టీవీ 5 మూర్తికి సోషల్ మీడియాలో గట్టి పాపులారిటీ ఉంది. అలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను టీవీ5 మూర్తి కొన్ని క్రేజీ ఇంటర్వ్యూలు చేశారు. ఆ విధంగా జర్నలిస్ట్ అయినప్పటికీ అందరికీ సుపరిచితుడే. ఆయన దర్శకుడిగా మారుతున్నాడన్న న్యూస్ సంచలనం రేపుతోంది. అందులోనూ ఇది పొలిటికల్ థ్రిల్లర్ అట. 
 
ఇక టీవీ5 మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ మూవీ అనగానే అది సీఎం జగన్ కి వ్యతిరేకంగా తెరకెక్కుతున్న సినిమా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరో తొమ్మిది నెలల్లో ఏపీలో ఎన్నికలు. ఈ క్రమంలో జగన్ టార్గెట్ ఈ చిత్రం తెరకెక్కుతోందని అంటున్నారు. గతంలో నారా రోహిత్ ప్రతినిధి టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ చేశారు. ప్రతినిధి 2 కూడా అని ప్రచారం జరుగుతుంది. ఇది జర్నలిజం మీద సెటైర్ అంటూ మరో వాదన వినిపిస్తోంది. నారా రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.