Nagarjuna : నాగార్జున కి బాగా కలిసొచ్చిన తేదీన నాగచైతన్య – శోభిత పెళ్లి ఫిక్స్..తండ్రి మీద నాగచైతన్య ఎంత ప్రేమో!

డిసెంబర్ నెలలోనే ముహూర్తం పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఎక్కువగా పెళ్ళీళ్ళు జరుగుతాయి. అంతే కాకుండా నాగార్జున కి డిసెంబర్ నెల ఎంతో బాగా కలిసొచ్చే నెల అని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ నెలలో నాగార్జున విడుదల చేసిన సినిమాలు 90 శాతంకి పైగా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

Written By: Vicky, Updated On : August 20, 2024 6:29 pm

Nagarjuna

Follow us on

Nagarjuna : సమంత తో విడాకుల తర్వాత చాలా కాలం నుండి ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్న నాగ చైతన్య రీసెంట్ గానే ఆమెతో పెద్దల సమక్షం లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సమంతతో పెళ్లి, విడాకులు ఎంత సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో, శోభితతో పెళ్లి కూడా అంతే సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు అనే అంశం పైన చర్చలు నడుస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఇరు కుటుంబాలు పెళ్లి ఎక్కడ జరిపించాలి అనే విషయం పై చర్చిస్తున్నారు. రాజస్థాన్/ మధ్యప్రదేశ్, లేదా విదేశాల్లో చెయ్యాలా అనే దానిపై ఆలోచిస్తున్నారు.

డిసెంబర్ నెలలోనే ముహూర్తం పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఎక్కువగా పెళ్ళీళ్ళు జరుగుతాయి. అంతే కాకుండా నాగార్జున కి డిసెంబర్ నెల ఎంతో బాగా కలిసొచ్చే నెల అని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ నెలలో నాగార్జున విడుదల చేసిన సినిమాలు 90 శాతంకి పైగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. అంతే కాకుండా ఆయన జీవితంలో ఎన్నో ప్రత్యేకమైన సంఘటనలు కూడా ఇదే నెలలో జరిగాయి. ఆ నెలలోనే పెళ్లి చేసుకుంటే నాగ చైతన్య తాను ప్రారంభించబోయే కొత్త జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని బలమైన విశ్వాసంతో ఉన్నాడు. ఒకవేళ డిసెంబర్ లో కుదరకపోతే, ఫిబ్రవరి నెలలో జరిపించాలని రెండవ ఛాయస్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య ద్రుష్టి మొత్తం ‘తండేల్’ చిత్రం మీదనే ఉంది. కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్ల నుండి అక్కినేని ఫ్యామిలీ నుండి విడుదల అవుతున్న ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి.

అందుకే ఈసారి అక్కినేని అభిమానులు తమ జ్ఞాపకాల లైబ్రరీ లో చిరకాలం దాచుకునే సూపర్ హిట్ చిత్రం గా ‘తండేల్’ మిగిలిపోవాలని నాగ చైతన్య ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మళ్ళీ నాగ చైతన్య – సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. ఈ సినిమా పూర్తి అయ్యాకనే నాగ చైతన్య పెళ్లి పనుల్లో బిజీ కాబోతున్నాడు. డిసెంబర్ నెలలో , లేదా దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. చూడాలి మరి అక్కినేని ఫ్యామిలీ కోరుకుంటున్న హిట్ ఈ సినిమా ద్వారా దక్కుతుందా లేదా అనేది.