Naga Chaitanya- Samantha: చై సమంత మళ్లీ కలవబోతున్నారా?

ప్రస్తుతం సామ్, చై ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈ మధ్య సామ్ యశోద, శాకుంతలం, ఖుషీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అందులో ఖుషీ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది.

Written By: Suresh, Updated On : September 16, 2023 12:53 pm

Naga Chaitanya- Samantha

Follow us on

Naga Chaitanya- Samantha: నాగ చైతన్య, సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కానీ తొందరలోనే కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. కానీ ఈ మధ్య చై సామ్ ఫోటోలు మళ్లీ సమంత ఇన్ స్టాగ్రామ్ లో దర్శనమిచ్చాయి. దీంతో వీరు కలవబోతున్నారా? అనే ప్రశ్నలు వేస్తున్నారు వీరి అభిమానులు. అంతేకాదు కలవాలని కోరుకుంటున్నారు కూడా.

ప్రస్తుతం సామ్, చై ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈ మధ్య సామ్ యశోద, శాకుంతలం, ఖుషీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అందులో ఖుషీ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. అయితే నాగచైతన్యకు మాత్రం ఈ మధ్య ఒక్క హిట్ కూడా లేదు. గతంలో కస్టడీ సినిమాతో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నారు.. కానీ అనుకున్న రేంజ్ లో సినిమా హిట్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే చైసామ్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.

వీరు విడాకులు తీసుకునే కంటే ముందే సమంత ఫోటోలను డిలీట్ చేయడం, అన్ ఫాలో చేయడంతో ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. వీరి ప్రవర్తనతో విడాకులు వార్తలు వైరల్ గా మారాయి. అది తొందరలోనే నిజం అని తెలిసింది. అయితే ఇప్పుడు సమంత ఇన్ స్టాగ్రామ్ లో మళ్లీ చైతన్య, సమంత ఫోటోలు కనిపిస్తున్నాయి. సమంతను ఫాలో అయ్యేవారికి ఆమె హాలీడేకు సంబంధించిన ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా కనిపించడంతో మళ్లీ వీరిద్దరు కలుస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే వీరిద్దరు కలిస్తే అక్కినేని అభిమానులకు ఫుల్ సంతోషమే..

ఇంతకాలం ఫోటోలను కనిపించకుండా ఆర్చీవ్ చేసిన సమంత ఆ ఫోటోలను మళ్లీ ఇన్ స్టాలోకి వచ్చేలా చేయడంతో సామ్ ఏం చెబుతుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చైసామ్ సూపర్ జోడీ అని క్యూట్ జోడీ అని బెస్ట్ కపుల్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చైసామ్ విడాకుల సమయంలో ఎక్కువమంది సమంతనే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అయితే చైతన్య మాత్రం సమంత గురించి నెగిటివ్ గా ఎక్కడా కామెంట్లు చేయలేదు.

సమంత-నాగచైతన్య కలిసి నటించిన తొలి సినిమా ఏమాయ చేశావే. గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతోనే సమంత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో జెస్సీ అనే అమ్మాయి పాత్రలో నటించి సమంతా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నాగ చైతన్య ‘ఏమాయ చేశావే’ సినిమా కంటే ముందు ‘జోష్’ అనే సినిమాలో నటించాడు. అయితే, ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘ఏమాయ చేశావే’ మూవీతోనే మంచి హిట్ అందుకున్నాడు.