Homeఎంటర్టైన్మెంట్మన రక్తం చల్లబడిపోయిందంటున్న నాగబాబు

మన రక్తం చల్లబడిపోయిందంటున్న నాగబాబు

Nagababu-Tweets

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒకవైపు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూనే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాగబాబు.. రాజకీయ, సినీ వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, తన యూట్యూబ్‌ చానల్లో తరచూ కామెంట్లు చేస్తుంటారు. ఈ మధ్య గాడ్సేను పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆపై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సినీ పెద్దల సమావేశానికి తనను ఎవరూ పిలువలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో బాలకృష్ణ తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు. దాంతో, మెగా, నందమూరి అభిమానులు మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. ఇలాంటి సమయంలో నాగబాబు ట్విట్టర్లో మరోసారి ఆసక్తికర కామెంట్లు చేశారు. భారతీయుల రక్తం చల్లబడిపోయిందని, ఛత్రపతి శివాజీ, వంటి మహావీరుల కథలు చదివిస్తే మన పిల్లల్ని అయినా మరిగే రక్తంతో పెరుగుతారని అన్నారు.

‘భారతీయుల రక్తం శాంతి, అహింస మంత్రాలతో చల్లబడిపోయింది.తిరిగి రక్తం వేడెక్కాలంటే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, అశోక చక్రవర్తి, సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్, శ్రీకృష్ణ దేవరాయలు,రాజ రాజచోళుడు, సముద్రగుప్తుడు మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ అయినా సాహసం, పౌరుషం, మరిగే రక్తం తో పెరుగుతారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది.వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దాం. భారత దేశానికి ,దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి. డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు, గుండాలు, మాఫియా, ఫ్యాక్షన్ గుండా రాజకీయ నాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని.’ అని వరుస ట్వీట్స్‌ చేశారు. అయితే, నాగబాబు ట్వీట్లపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగా చెప్పారని అంటుంటే… మరికొందరు బీజేపీ భజన చేస్తున్నారని విమర్శిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version