spot_img
Homeజాతీయ వార్తలునాటి ఉద్యమకారులు నేడు ఏమైపోయారు?

నాటి ఉద్యమకారులు నేడు ఏమైపోయారు?

Respect for telangana martyrs

దశాబ్దాల పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. జూన్ 2న నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టిసారించారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కొన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధితో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓ సామాజికవర్గానికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

కేసీఆర్ క్యాబినెట్లో ఓసీలే అధికం..
కేసీఆర్ క్యాబినెట్లో అగ్రకులాలకే ప్రాధాన్యం దక్కింది. కేసీఆర్ మంత్రివర్గంలో మొత్తం 18మందికి ఛాన్స్ దక్కింది. వీరిలో ఓసీలు(రెడ్లు ఆరుగురు, వెలమలు నలుగురు, కమ్మ ఒకరు) ఉన్నారు. బీసీలు నలుగురు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రెడ్ల నుంచి ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. వెలమ నుంచి సీఎంగా కేసీఆర్‌‌‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌ రావు, హరీశ్‌‌‌‌రావు, కేటీఆర్‌ ఉన్నారు. కమ్మ వర్గం నుంచి పువ్వాడ అజయ్‌‌ ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాల నుంచి నలుగురు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నుంచి ఒక్కొక్కరి పదవి దక్కింది. బీసీల నుంచి ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌, ఎస్సీ నుంచి కొప్పుల ఈశ్వర్‌‌‌‌, మైనార్టీల నుంచి మహమూద్‌‌‌‌ అలీ, ఎస్టీ నుంచి సత్యవతి రాథోడ్‌‌‌‌కు అవకాశం దక్కింది.

సమగ్ర కుటుంబ సర్వే చెబుతున్న లెక్కలు..
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఓసీ జనాభా 8శాతం ఉన్నాయి. ఈ వర్గానికి 61 శాతం పదవులు దక్కాయి. 92 శాతం జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు 38 శాతం పదవులే దక్కాయి. 52శాతం బీసీలు ఉండగా 22శాతం మంత్రి పదవులే దక్కాయి.15 శాతం ఉన్న ఎస్సీలకు, 10శాతం ఉన్న ఎస్టీలకు, 14శాతం మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవే మాత్రమే దక్కడం గమనార్హం.

గొర్రెలు, బర్లు వారికి.. పదవులు మాత్రం వీరికి..
తెలంగాణలో 92శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల వారికి పదవుల్లో కేసీఆర్ మొండిచేయి చూపారు. ఇక సంక్షేమం పేరుతో గొర్ల కాపర్లకు గొర్ల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, బర్ల పంపిణీ వంటి వాటితో ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకున్నారని ఆయావర్గాల ప్రజలు వాపోతున్నారు. అలాగే తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడిన ఉద్యమకారులు, కళకారులు నేడు పత్తాకు లేకుండా పోవడం వెనుక కారణంలేంటో తెలియడం లేదు. ఒకప్పుడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గద్దర్, విమలక్క లాంటి పేర్లు కూడా నేడు తెలంగాణలో విన్పించడం లేదు. వీరంతా ఏమైయ్యరనే ప్రశ్న సామన్యులను తొలుస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల్లేక నైరాశ్యంలో మునిగిపోయారు. నిరుద్యోగులు మరో ఉద్యమానికి నాంది పలికేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో పదవులు దక్కించుకున్న ఓసీలు వారికి సామాజిక వర్గానికే పెద్దపీఠ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వ్యాపారాలన్నీ వారి చేతుల్లోనే..
ఈ ఆరేళ్లలో హైదరాబాద్ చుట్టు పక్కల కంపెనీలన్నీ వెలమ, రెడ్డి వర్గాల వారి చేతుల్లోనే వ్యాపారాలన్నింటిని ప్రభుత్వం పెడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. విలువైన ప్రభుత్వ భూములన్నీ ఈ సామాజిక వర్గానికే కట్టబడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరేళ్లలో ఓసీ వర్గాలు అభివృద్ధిలో జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా మిగిలిన వర్గాల అభివృద్ధి మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా తయారైందని ఆయావర్గాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో 92శాతంగా ఉన్న జనాభా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి పెద్దపీఠ వేయాలని ఆయావర్గాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version