spot_img
Homeఎంటర్టైన్మెంట్Mohan Babu: మౌనిక, మనోజ్ ల నుండి నాకు ప్రాణహాని ఉంది.. కన్న కొడుకుపై కేసు...

Mohan Babu: మౌనిక, మనోజ్ ల నుండి నాకు ప్రాణహాని ఉంది.. కన్న కొడుకుపై కేసు పెట్టిన మోహన్ బాబు!

Mohan Babu: మోహన్ బాబుకి చిన్న కుమారుడు మనోజ్ తో విబేధాలు తలెత్తాయి. అందుకు ఆస్తుల పంపకాలే కారణం అనే వాదన ఉంది. తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న మనోజ్… తండ్రి మోహన్ బాబుపై ఒత్తిడి తెస్తున్నాడట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అది భౌతిక దాడుల వరకు వెళ్ళింది. మనోజ్ ని మోహన్ బాబు మనుషులు కొట్టారట. మనోజ్ గాయాలతో ఆసుపత్రికి రావడం మీడియాలో ప్రసారమైంది. మనోజ్ మాత్రం మీడియాతో మాట్లాడలేదు.

డిసెంబర్ 10న జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న విష్ణు ఒక 40 మంది బౌన్సర్స్ ని అక్కడ ఏర్పాటు చేసాడు. అలాగే మనోజ్ కూడా 30 మంది బౌన్సర్స్ తో అక్కడకు వచ్చారు. విష్ణు హైదరాబాద్ వస్తున్నారని, మంచు విష్ణు, మనోజ్, మోహన్ బాబు మధ్య ఓ మీటింగ్ చోటు చేసుకోనుందని కథనాలు వెలువడ్డాయి. ముంబైలో ఉన్న మంచు లక్ష్మి సైతం హైదరాబాద్ వచ్చారు. జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద భారీ హైడ్రామా చోటు చేసుకుంది.

కాగా సాయంత్రానికి మనోజ్, మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఫహడ్ షరీఫ్ సీఐ ని కలిసిన మనోజ్.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు, విష్ణు పేర్లను ఫిర్యాదులో మనోజ్ చేర్చలేదు. మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై ఆయన కంప్లైంట్ చేశారు. మరోవైపు మోహన్ బాబు నేరుగా కొడుకు, కోడలిపై ఫిర్యాదు చేశారు.

మంచు మనోజ్, మౌనికల నుండి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ సీపీకి వాట్సప్ మెసేజ్ ద్వారా కంప్లైంట్ చేశాడట. కన్న కొడుకు నుండి తనకు ప్రమాదం పొంచి ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. కాగా జుల్పల్లిలో గల గెస్ట్ హౌస్ కోసమే ఈ వివాదం అని తెలుస్తుంది. మోహన్ బాబు తన చివరి రోజుల ప్రశాంతంగా గడిపేందుకు జుల్పల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారు. ఆ హౌస్ తనకు ఇవ్వాలని మనోజ్ అడుగుతున్నాడట. దాని ధర కోట్లలో ఉందట.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version