Homeఎంటర్టైన్మెంట్Mayasabha Web Series Controversies: ‘మయసభ’ కాదు ఇదీ.. రాజకీయ ప్రతీకార సభ?

Mayasabha Web Series Controversies: ‘మయసభ’ కాదు ఇదీ.. రాజకీయ ప్రతీకార సభ?

Mayasabha Web Series Controversies: ఒటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పెరుగుతున్న ఈ రోజుల్లో, వివాదాస్పద వెబ్‌సిరీస్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల, దర్శకుడు దేవాకట్టా, కిరణ్ జయ్ కుమార్ రూపొందించిన ‘మయసభ’ వెబ్‌సిరీస్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలిన పాత్రను చిత్రీకరించిన తీరు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు

ఇందిరా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు

‘మయసభ’ వెబ్‌సిరీస్‌లో ఒక పాత్ర ఇందిరా గాంధీని ఉద్దేశించి, “పోలీసులను నాయకుల మీదకి పంపించి, విద్యార్థులను ప్రజల మీదకు పోనిచ్చిన ముం**డ” అని వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. చాలామంది ఈ వ్యాఖ్యను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక మాజీ ప్రధాని గురించి ఇలాంటి అనుచిత భాషను వాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు నాయుడు పాత్ర – నిజజీవితాన్ని అనుసరించిందా?

మరోవైపు, ఈ వెబ్‌సిరీస్‌లో చంద్రబాబు నాయుడును పోలిన ఒక పాత్ర ఒక రికార్డింగ్ డాన్సర్‌తో ప్రేమించి, ఆమెను ఇంటి నుంచి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటుందని చూపించారు. ఈ కథాంశంపై ప్రేక్షకులు, రాజకీయ విశ్లేషకులు ఇది నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసినదేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది రంగస్థల నటీమణులను ఉద్దేశించి చేసిన కల్పన అయి ఉండవచ్చని చర్చలు జరుగుతున్నాయి. అయితే, దర్శకుడు ఇది పూర్తిగా కల్పిత కథ అని వివరణ ఇచ్చినప్పటికీ, పాత్రల చిత్రణ తీరుపై విమర్శలు ఆగడం లేదు.

ఈ మూవీ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలను ఆధారంగా చేసుకుని తీశారని విమర్శలు వచ్చాయి. ఇలాంటి చిత్రాలను సృజనాత్మకతగా కాకుండా, రాజకీయ దురుద్దేశంతో కూడినవిగా చాలామంది భావిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్లు

రాజకీయ నాయకులు, ముఖ్యంగా మాజీ ప్రధాని వంటి జాతీయ నాయకురాలి గురించి అనుచితంగా మాట్లాడినందుకు సెన్సార్ బోర్డు లేదా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలను క్రియేటివిటీ పేరుతో ప్రోత్సహించడం సరికాదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారు అంటున్నారు. ‘మయసభ’ వెబ్‌సిరీస్‌పై త్వరలోనే అధికారిక ప్రకటనలు, కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version