గుడ్ న్యూస్:  ‘ఆచార్య’  తర్వాత సినీ ఇండస్ట్రీలో మరో కొత్త ప్రాజెక్టు   

విభిన్న కథనాలను నిర్మిస్తూ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జెతో ఓ సినిమాను చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దర్శకుడు స్వరూప్ కి ఇది రెండో సినిమా కాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి ఇది ఎనిమిదో చిత్రంగా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తూ ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది. Also Read: జేపీ మృతి తీరని […]

Written By: NARESH, Updated On : September 8, 2020 4:09 pm

matnee entertainments

Follow us on

విభిన్న కథనాలను నిర్మిస్తూ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జెతో ఓ సినిమాను చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దర్శకుడు స్వరూప్ కి ఇది రెండో సినిమా కాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి ఇది ఎనిమిదో చిత్రంగా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తూ ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది.

Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

ఓ గోడపై కోడిపుంజు నిల్చుని ఉండగా.. ఇందులో వాంటెడ్ పోస్టర్ అతికించబడి కన్పిస్తుంది. అతడిని పట్టుకున్న వారికి 50లక్షల రివార్డ్ అని ప్రకటించబడి ఉంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సినిమాను తెరకెక్కబోతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో దర్శకుడు స్వరూప్, మ్యాట్నీ ఎంటట్మైమెంట్ కాంబోలో మరో విభిన్న కథ తెరకెక్కుతుందని టాక్ విన్పిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించి డిసెంబరులో సినిమాను పట్టాలెక్కంచేందుకు రెడీ అవుతోంది.

Also Read: జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ‘ఆచార్య’ మూవీ రాబోతుంది. నిర్మాత రాంచరణ్ తో కలిసి మ్యాట్నీ సంస్థ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదా పడింది. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే పట్టాలెక్కించేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. అదేవిధంగా కింగ్ నాగర్జునతో ‘వైల్డ్ డాగ్’ మూవీని మ్యాట్నీ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీలను త్వరగా పూర్తిచేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.