Mahesh Babu: “సర్కారు వారి పాట” విడుదల తేదీలో మార్పు … కొత్తరిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. గీత గోవిందం వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత  డైరెక్ట‌ర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ప్రోమో వీడియో లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 3, 2021 4:29 pm
Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. గీత గోవిందం వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత  డైరెక్ట‌ర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ప్రోమో వీడియో లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి దాపవాలి కానుకగా ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.

ఈ చిత్రా విడుదల తేదీని మారుస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గతంలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చ్చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే పలు కారణాల రీత్యా ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ మేరకు సర్కారు వారి పాట చిత్రాన్ని 2022 సమ్మర్ లో ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేస్తున్నాట్లో సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోని విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ విడుదల ను పోస్ట్ పోన్ చేయడంతో మహేశ్ బాబు అభిమానులు నిరాశ చెందుతున్నారు.

https://twitter.com/MythriOfficial/status/1455846032353337348?s=20

సంక్రాంతి బ‌రిలో నిలిస్తున్నట్లు అందరికంటే ముందుగానే ఈ మూవీ టీమ్ ప్రకటించింది. అయితే అనుకోని రీతిలో జ‌న‌వ‌రి 7న ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి సినిమా “ఆర్ ఆర్ ఆర్’ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రాన్ని విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. కాగా వచ్చే ఏడాది  జ‌న‌వ‌రి 12న భీమ్లా నాయక్,  జనవరి 14న రాధేశ్యామ్ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. దీంతో నిర్మాతలు ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.