Homeఎంటర్టైన్మెంట్Mahesh Rajamouli Movie: అక్షరాలా 120 దేశాలు..'ఎవెంజర్స్','అవతార్' రికార్డ్స్ ని బద్దలు కొట్టిన మహేష్,రాజమౌళి!

Mahesh Rajamouli Movie: అక్షరాలా 120 దేశాలు..’ఎవెంజర్స్’,’అవతార్’ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన మహేష్,రాజమౌళి!

Mahesh Rajamouli Movie: మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి అభిమానులు, ప్రేక్షకులు ఎంత అయితే ఊహించుకుంటారో, అంతకు మించి పది రెట్లు ఈ సినిమా ఉండబోతుంది. అసలు కలలో కూడా ఊహించని అద్భుతాలు ఈ సినిమా తో సృష్టించబోతోంది ఈ క్రేజీ కాంబినేషన్. #RRR చిత్రం తో హాలీవుడ్ లో రాజమౌళి తన బలమైన పాద ముద్ర వేశాడు. అక్కడితో ఆగిపోకుండా, ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న చిత్రాన్ని హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గానే కెన్యా లో ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఒక క్రేజీ అప్డేట్ నిన్న సోషల్ మీడియా లో రావడం తో, మహేష్ బాబు ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు. ఇది కదరా మా మహేష్ రేంజ్ కి తగ్గ ఫలితం రాబోతుండడం అంటే అని అభిమానులు మురిసిపోతున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?

ప్రముఖ హాలీవుడ్ సంస్థలు అయినటువంటి డిస్నీ మరియు సోనీ పిక్చర్స్ రాజమౌళి టీం తో గత కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నారట. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఈ క్రేజీ చిత్రాన్ని అన్ని దేశాల భాషల్లో డబ్ చేసి గ్రాండ్ గా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాయి ఈ రెండు హాలీవుడ్ సంస్థలు. దాదాపుగా 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు అవతార్ , ఎవెంజర్స్ వంటి చిత్రాలు కూడా ఈ రేంజ్ లో రిలీజ్ అవ్వలేదు. అవతార్ 2 చిత్రం 77 దేశాల్లో విడుదల అవ్వగా, ఎవెంజర్స్ ఎండ్ గేమ్ అనే చిత్రం 84 దేశాల్లో విడుదలైంది. ఇప్పుడు ఆ రెండు సినిమాలకంటే అదనంగా మరో 40 దేశాల్లో మహేష్, రాజమౌళి చిత్రం విడుదల కాబోతుంది. ఎప్పుడో రెండేళ్ల తర్వాత విడుదల అవ్వబొయే సినిమాకు ఇప్పటి నుండే బలమైన గ్రౌండ్ ని సిద్ధం చేస్తున్నాడు రాజమౌళి.

ఈ చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. అంటే శ్రీరాముడి కుటుంబానికి సంబంధించి 63 వ తరానికి చెందిన వాడిగా ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నాడు అన్నమాట. విలన్ క్యారక్టర్ తీవ్రమైన అనారోగ్యానికి గురై వీల్ చైర్ కి పరిమితం అవుతాడు. ఆయన రోగాన్ని నయం చేయాలంటే మృత సంజీవని కావాలి. ఆ సంజీవని సామాన్య మానవులకు దొరికేది కాదు. శ్రీరాముడి వంశస్తుడు అయినటువంటి హీరో క్యారక్టర్ కి మాత్రమే ఆ సంజీవని ని తెచ్చే సత్తా ఉంటుంది. అలా హీరోని బలవంతంగా విలన్ వద్దకు తీసుకొస్తారు. ఆ తర్వాత సంజీవని కోసం హీరో క్యారక్టర్ చేసే ప్రయాణం,మధ్యలో ఆయనకు ఎదురయ్యే అడ్వెంచర్ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular