మహేష్ బాబు మూవీ కి కథ మారింది

సరిలేరు నీకెవ్వరు చిత్రం తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకొన్న మహేష్ బాబు తన తరవాతి సినిమా విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటు యాక్షన్ ఎంటర్ టైనర్ కంటే ఫామిలీ ఎంటర్ టైనర్ మేలు అనుకోని ఆ దిశగా ఆలోచించాడు. ఆ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. కాగా కథ ప్రకారం ఈ చిత్రంలో చాల భాగం యుఎస్ బ్యాక్‌ డ్రాప్ […]

Written By: admin, Updated On : April 29, 2020 11:26 am
Follow us on


సరిలేరు నీకెవ్వరు చిత్రం తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకొన్న మహేష్ బాబు తన తరవాతి సినిమా విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటు యాక్షన్ ఎంటర్ టైనర్ కంటే ఫామిలీ ఎంటర్ టైనర్ మేలు అనుకోని ఆ దిశగా ఆలోచించాడు. ఆ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. కాగా కథ ప్రకారం ఈ చిత్రంలో చాల భాగం యుఎస్ బ్యాక్‌ డ్రాప్ లో షూటింగ్ జరపాలట .. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో షూట్ చేయడం కష్టం కనుక స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రం యొక్క నటీనటుల ఎన్నిక జరుగుతోంది. మహేష్ బాబుకు జోడీగా మహానటి కీర్తి సురేష్ ఖాయం అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. రీసెంట్ గా ఇదే విషయాన్నీ ఉపేంద్ర మీడియా తో చెప్పడం జరిగింది . సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో పోషించిన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నా అది విలన్ పాత్ర కాదు. కాగా కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నానని ఈ మధ్యనే అన్నాడు . కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఉపేంద్ర నే ఒప్పించాలని పట్టుదలగా ఉన్నారు .