
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బ్లస్టర్ హిట్టందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ‘సరిలేరునీకెవ్వరు’తో అభిమానులను పలకరించాడు. మహేష్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ రిలీజై నాలుగైదు నెలలు గడుస్తున్నా మహేష్ కొత్త మూవీ ప్రారంభం కాలేదు. ‘సరిలేరునీకెవ్వరు’ తర్వాత వంశీపడిపైల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే వంశీపైడిపల్లి స్క్రీప్ట్ పనులు పూర్తి చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అయింది. దీంతో మహేష్ బాబు ఇతరుల దర్శకుల చెప్పిన కథలను విన్నాడు. దర్శకుడు పర్శురాం చెప్పిన కథ నచ్చడంతో మహేష్ బాబు అతడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మహేష్ బాబు ప్రతీయేటా సూపర్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులకు ఏదోఒక అప్డేట్స్ ఇస్తుంటాడు. సినిమా రిలీజు, ఫస్టు లుక్, సాంగ్స్ విడుదల చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ గిప్ట్ ఇస్తుంటాడు. ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈసారి మహేష్ బాబు కొత్త మూవీ అప్డేట్ ఉండదనుందని ప్రచారం జరుగుతుంది. ‘గీతా గోవిందం’ ఫేం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27వ మూవీని అధికారికంగా ప్రకటించనున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. మహేష్-పరశురామ్ కాంబోలో వచ్చే మూవీకి ‘సర్కార్ పాట’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం సెంటిమెంట్ గా వస్తోంది. దీంతో ఈ మూవీ పూజా కార్యక్రమాలను చిత్రబృందమే ప్రారంభించనుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబరు లేదా అక్టోబర్ లో పట్టాలెక్కనుందని సమాచారం. ‘సర్కార్ పాట’ టైటిల్ చూస్తుంటే ఇది రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. దీనిపై చిత్రబృందం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.