Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే అంశం పై సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొంతమంది డైరెక్టర్ బుచ్చి బాబు తో ఒక సినిమా చేయబోతున్నాడని చెప్తుంటే, మరికొంతమంది మాత్రం సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. నాగ్ అశ్విన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కానీ వీటిల్లో బుచ్చి బాబు తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. రీసెంట్ గా ‘పెద్ది’ మూవీ సక్సెస్ మీట్ లో కూడా విలేఖరులు మీ తదుపరి సినిమా మహేష్ బాబు తో అని ప్రచారం జరుగుతుంది , దీనిపై మీ కామెంట్స్ అని అడగ్గా, దేనికైనా సమయం రావాలి అండీ, చూద్దాం అంటూ చెప్పుకొచ్చాడు.
అంటే ఆయన సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే ఈ వార్తలను ఖండించలేదు అంటే , కచ్చితంగా చర్చలు జరిగాయి అనే దాని అర్థం. ఇది కాసేపు పక్కన పెడితే , ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని , ఈ చిత్రాన్ని ఏషియన్ సునీల్ నిర్మిస్తాడని అంటున్నారు. ఇదొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని , ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కోచ్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాలు మాత్రమే , ఏది కూడా అధికారికంగా ఖరారు కాలేదు. ‘వారణాసి’ పూర్తి అయ్యాకే మహేష్ తదుపరి చిత్రం పై స్పష్టమైన క్లారిటీ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా సందీప్ రెడ్డి వంగ తో మహేష్ బాబు సినిమా అయితే లేదు.
ఇక ‘వారణాసి’ విషయానికి వస్తే, ఈ చిత్రం షూటింగ్ విరామం లేకుండా శరవేగంగా సాగుతోంది. సెప్టెంబర్ నెల లోపు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని అంటున్నారు. ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదనే ద్రుష్టి పెడతారట. ఎందుకంటే ఈ సినిమా అత్యధిక శాతం VFX మీద ఆధారపడింది. అందుకే ఈ చిత్రం ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 7 న విడుదల అవ్వడం కష్టమని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
