Homeఎంటర్టైన్మెంట్Tollywood: శ్రీమంతుడు ప్రేరణతో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేసిన సుభాష్ రెడ్డి... అభినందిస్తూ ట్వీట్...

Tollywood: శ్రీమంతుడు ప్రేరణతో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేసిన సుభాష్ రెడ్డి… అభినందిస్తూ ట్వీట్ చేసిన మహేష్ బాబు

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ  సినిమా ప్రేరణ తో సుభాష్ రెడ్డి చేసిన పనికి ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ‘శ్రీమంతుడు’ సినిమాను స్పూర్తిగా తీసుకొని సుభాష్‌రెడ్డి కామారెడ్డి జిల్లాలోని బీబీపేటలో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

mahesh babu appreciates subhash reddy in twitter

ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌బాబు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ పాఠశాల వెనుక శ్రీమంతుడు ఒక ప్రేరణ అని తెలుసుకోవడానికి పదాలు రావడం లేదని అన్నారు. మీరే నిజమైన హీరో, మీలాంటి వారు మాకు ఇంకా కావాలి అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత శ్రీమంతుడు బృందంతో తప్పకుండా సందర్శిస్తా అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

 

ప్రస్తుతం మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ మూవీని ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular