హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత, శ్రీరెడ్డి బాటలో నడుస్తున్నారు. రాకేష్ మాస్టర్ గతంలో వివాదస్పద నటి శ్రీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకున్నారు. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీరెడ్డి అతడికి లీగల్ నోటీసులు కూడా పంపించింది. తాజాగా మాధవీలత కూడా రాకేష్ మాస్టర్ కు లీగల్ నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా రాకేష్ మాస్టర్ తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఎంతో బాధించాయని మాధవీలత తెలిపింది. ఆయన సోషల్ మీడియా వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని లేకుంటే అతడిపై పరువు నష్టం కేసు వేస్తానని మాధవీలత ఫైరవుతోంది.
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో రాకేష్ మాస్టర్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనిపెద్దలు, ప్రముఖులపై కొన్నిరోజులుగా రాకేష్ మాస్టర్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో ఇండస్ట్రీలో అతడి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తదితర సెలబ్రెటీలపై ఆయన వ్యక్తిగతగా దూషిస్తూ మాట్లాడటంతో వారి ఫ్యాన్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల శ్రీరెడ్డి, మాధవీలతపై కూడా దుర్భాషలాడటంతో వారిద్దరు లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. ఇప్పటికే శ్రీరెడ్డి అతడికి లీగల్ నోటీసులు పంపించింది. కాగా మాధవీలత కూడా అతడిపై పరువు నష్టం కేసు వేసేందుకు సిద్ధమవుతుంది. ఆయన తనకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయనతో లీగల్ గా తేల్చుకునేందుకు సిద్ధమేనంటూ స్పష్టం చేసింది. శ్రీరెడ్డి, మాధవీలత లీగల్ నోటీసులపై రాకేష్ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..! వీరిద్దరు లీగల్ ఫైట్ తో ఏకమవడంతో అతడి పరిస్థితి నారీ.. నారీ.. నడుమ రాకేష్ మాస్టర్ అన్నట్లుగా మారింది.