Anurag Kashyap : సైంటిస్ట్ కావాలనుకొని.. డైరెక్టర్, యాక్టర్ అయ్యాడు.. బాలీవుడ్ నే షేక్ చేస్తున్నాడు.. ఈయన లైఫ్ స్టోరీ ఇదే

అతనో బాలీవుడ్ డైరెక్టర్ పేరు అనురాగ్ కశ్యప్.. సైంటిస్ట్ కావాలని కాలేజీలో చేరాడు. కానీ విధి ఆయనను సినిమా రంగం వైపునకు నడిపించింది. అక్కడి కూడా వెనక్కి చూసుకోకుండా కష్టపడ్డాడు. కట్ చేస్తే అవార్డులు, రివార్డులు, బాక్సాఫీస్ సినిమాలు ఇలా బాలీవుడ్ బుక్ లో తనకు ఒక పేజీని క్రియేట్ చేసుకున్నాడు.

Written By: Mahi, Updated On : September 10, 2024 12:21 pm

Anurag Kashyap

Follow us on

Anurag Kashyap: అనురాగ్ కశ్యప్, ఒక అత్యాధునిక దర్శకుడు, రచయిత, నిర్మాత. ఒక కల్ట్‌ను సృష్టించడం ద్వారా భారతీయ సినిమా క్వెంటిన్ టరాన్టినో అని గుర్తింపు దక్కింది. తను కోరుకున్న రంగం కాకపోయినా మనసు పెడితే ఏదైనా సాధ్యమని నిరూపించాడు. సైంటిస్ట్ కావాలనుకొని కలలు కన్న ఆయన సినిమాల వైపు మళ్లి అక్కడా తాను ఏంటనేది నిరూపించుకున్నాడు. బాలీవుడ్ కు అందించిన సినిమాల్లో ఆయన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ ఇప్పటికీ కల్ట్ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఈ రోజు (సెప్టెంబర్ 10) అనురాగ్ కశ్యప్ పుట్టిన రోజు ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అనురాగ్ 1972, సెప్టెంబర్ 10న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో జన్మించారు. యూపీకి చెందిన ఓ కుర్రవాడు సినిమాల్లోకి వచ్చిన తీరు గురించి తెలుసుకోవాల్సిందే. అనురాగ్ కశ్యప్ విద్యాభ్యాసం డెహ్రాడూన్ లో జరిగింది. ఎనిమిది సంవత్సరాల వయసులో గ్వాలియర్ కు వచ్చాడు. ఆ యుగంలో అనురాగ్ కశ్యప్ దర్శకుడిగానో, రచయితగానో కాకుండా సైంటిస్ట్ కావాలనుకున్నాడు. అందుకే ఆయన ఢిల్లీకి వచ్చి ఇక్కడి ప్రఖ్యాత హన్స్ రాజ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుడు. అయితే, ఈ సమయంలో అతను వీధి నాటకాలు, వారి ట్రూప్ తో ఎక్కువగా తిరిగే వాడు. దీంతో ఆయన మనసు అటువైపునకు మళ్లింది. దీని కారణంగా అతని చదువు పక్కదారి పట్టడం మొదలైంది. ఈ సమయంలో అనురాగ్ కు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో అవకాశం వచ్చింది. అంతకు ముందు అనురాగ్ 10 రోజుల్లో 55 సినిమాలు చూశాడట. అక్కడి నుంచి నా మనసు సినీ రంగం వైపునకు కదిలిందని చెప్పారు.

సత్య కథ అందించిన అనురాగ్..
అనురాగ్ సినిమాల వైపునకు కదిలాడు. 18 సంవత్సరాల వయస్సు 1998 లో ఐఫోన్ 17 నుంచి గుర్తింపు అందుకున్నాడు. 1998లో రామ్ గోపాల్ వర్మ ‘సత్య’లో కొ రైటర్ గా చేశాడు. ఇది ఆయనకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. తర్వాత అతను ‘పాంచ్‌’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ, సెన్సార్ సమస్యల కారణంగా ఇది థియేటర్లలోకి రాలేదు. 1999లో, టెలివిజన్ కోసం లాస్ట్ ట్రైన్ టు మహాకాళి అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. అనురాగ్ కశ్యప్ ఇప్పటివరకు 31కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ లకు దర్శకత్వం వహించారు.

2011లో అనురాగ్ ‘దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్‌’కు దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ లో కల్కి కోచ్లిన్ అతనితో కలిసి రచయితగా పనిచేసింది. ఈ చిత్రం 2010 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 67వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా అనేక ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది.

విలన్ పాత్రలో అనురాగ్
అనురాగ్ ఇప్పుడు కెమెరా వెనుక మాత్రమే కాకుండా కెమెరా ముందు కూడా తన పనితనాన్ని చూపిస్తూ సోనాక్షి సిన్హా నటించిన ‘అకీరా’, అలాగే ‘భద్రి’ చిత్రాల్లో విలన్ గా నటించి ఆశ్చర్యపరిచాడు. దీంతో పాటు ఇటీవల విడుదలైన విజయ్ సేతుపతి సినిమా మహారాజాలో విలన్ పాత్రలో కశ్యప్ కనిపించి, నటనతో విమర్శకులను మెప్పించారు. వీటితో పాటు పలు కథల్లో విలన్ గా కనిపించాడు.

రెండు పెళ్లిళ్లు..
అనురాగ్ కశ్యప్ 1997లో ఆర్తిని వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్యంలో భేదాభిప్రాయాలు రావడంతో 2009 లో విడిపోయారు. ఆ తర్వాత అనురాగ్ నటి కల్కి కొచ్లిన్ తో డేటింగ్ చేసి ఆ తర్వాత ఆమెను 2011 లో వివాహం చేసుకున్నాడు. వీరు కూడా మూడేళ్లలో విడిపోయారు. ప్రస్తుతం సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

యజమాని ఎన్ని కోట్లో తెలుసుకోండి
అనురాగ్ కశ్యప్ రచయిత, దర్శకుడు, నటుడు మాత్రమే కాదు, అనురాగ్ కశ్యప్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. దీంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన దర్శకుల్లో అనురాగ్ కూడా ఉన్నారు. ఇక ఆయన నెట్ వర్క్ విషయానికొస్తే.. ఆయన నెట్ వర్క్ విలువ రూ.980 కోట్లు. డైరెక్షన్ ప్రొడక్షన్, స్క్రీన్ రైటింగ్ ద్వారా అనురాగ్ చాలా సంపాదిస్తున్నాడు.