Kumari Aunty: బిగ్ బాస్ షోకి కుమారి ఆంటీ… మేకర్స్ మాస్టర్ స్కెచ్?

కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కి జనాలు క్యూ కడుతున్నారు. జనాలు ఎక్కువగా అక్కడికి రావడంతో ఫుడ్ బ్లాగర్లు, యూట్యూబర్స్ వీడియోలు తీసి మరింత ఫేమస్ అయ్యేలా చేశారు. ఇక మీమర్స్ ఐతే కుమారి ఆంటీ పై రీల్స్ చేసి పోస్ట్ చేశారు.

Written By: S Reddy, Updated On : February 1, 2024 6:45 pm

Kumari Aunty

Follow us on

Kumari Aunty: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. హైదరాబాద్ మాదాపూర్ లోని కోహినూరు హోటల్ ఎదురుగా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించింది. రుచికరమైన భోజనం తక్కువ ధరకే అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కుమారి ఆంటీ దగ్గర బాగా ఫేమస్. తక్కువ సమయంలోనే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ క్లిక్ అయింది. స్టార్టింగ్ లో 5 కేజిలతో మొదలుపెట్టిన వ్యాపారం ఇప్పుడు 1000 కేజీలకు పైగా అమ్ముడుపోతుంది.

కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కి జనాలు క్యూ కడుతున్నారు. జనాలు ఎక్కువగా అక్కడికి రావడంతో ఫుడ్ బ్లాగర్లు, యూట్యూబర్స్ వీడియోలు తీసి మరింత ఫేమస్ అయ్యేలా చేశారు. ఇక మీమర్స్ ఐతే కుమారి ఆంటీ పై రీల్స్ చేసి పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు సోషల్ మీడియా లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. మీడియా సైతం కుమారి ఆంటీ పై ఫోకస్ పెట్టింది. సామాన్య ప్రజలే కాదు సెలెబ్రెటీల సైతం కుమారి ఆంటీ చేతి వంట రుచి చూస్తున్నారు.

ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్ తన కొత్త సినిమా ‘ ఊరు పేరు భైరవకోన ‘ ప్రమోషన్స్ లో భాగంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ లో భోజనం చేశారు. అయితే తాజాగా కుమారి ఆంటీ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫుడ్ సెంటర్ ఎదుట జనం బారులు తీరుతుండంతో .. ఆ ప్రాంతంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందట. ఇది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారడంతో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ సీజ్ చేశారు పోలీసులు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు కుమారి ఆంటీ కి సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది. కుమారి ఆంటీ ని బిగ్ బాస్ కి పంపించాలని కొందరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటిటీ సీజన్ 2 ప్రారంభం కానుంది. అయితే బిగ్ బాస్ ఒటీటీలోకి ఆమెను తీసుకోవాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆమె బిగ్ బాస్ కి వెళితే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని .. కామన్ మ్యాన్ కేటగిరీ లో కుమారి ఆంటీ ని బిగ్ బాస్ లోకి తీసుకోవాలి అని అంటున్నారు. దీంతో ఆడియన్స్ డిమాండ్ మేరకు కుమారిని బిగ్ బాస్ షోకి పంపాలని మేకర్స్ స్కెచ్ వేశారట. ఇక ప్రస్తుతం కుమారి ఆంటీ కేసు నుంచి బయట పడి తన ఫుడ్ స్టాల్ ను పునః ప్రారంభించింది.