Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం . ‘రాజా వారు రాణి వారు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’, ‘క’, ‘k ర్యాంప్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి కానీ , చాలా తొందరగానే కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాడు. అయితే హీరో గా తనని తానూ నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం , ఇప్పుడు డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇది ఆయన 13 వ సినిమా అట. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.
చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈ చిత్రం లో హోటల్ ఓనర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నాడు. జాయ్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం మంచిగా హీరో గా కొనసాగుతున్నాడు కదా, ఇప్పుడు ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా అని సోషల్ మీడియా లో కొంతమంది అంటున్నారు. కానీ కిరణ్ అబ్బవరం కేవలం హీరో మాత్రమే కాదు , ఒకప్పుడు రైటర్ గా కూడా పని చేశాడు. తన మొట్టమొదటి కమర్షియల్ సూపర్ హిట్ ‘SR కళ్యాణ మండపం’ కి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ రాసింది మరెవరో కాదు , కిరణ్ అబ్బవరమే. ఈ సినిమా టైటిల్స్ పడేటప్పుడు ఈ విషయాన్నీ గమనించొచ్చు. అంతే కాకుండా , హీరో అవ్వకముందు ఆయన ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ చిత్రాన్ని స్వయంగా ఆయనే డైరెక్షన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా పై ఆడియన్స్ లో ఆయన ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

