Kalki 2898 AD Sequel: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘కల్కి 2’. 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘కల్కి’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ జోడించి , నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు అమోఘం. అసలు ఇలాంటి ఆలోచన రావడమే అద్భుతం అనుకుంటే, ఆ ఆలోచనకు అద్భుతమైన విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వడం మరో అద్భుతం. అలాంటి వెండితెర అద్భుతానికి రీసెంట్ గానే సీక్వెల్ షూటింగ్ ని మొదలు పెట్టారు. కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ మరియు ఇతర తారాగణం పై పలు కీలక సన్నివేశాలను రెసిన్ గానే చిత్రీకరించారు.
రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారట. సెప్టెంబర్ నుండి పూర్తి స్థాయి షూటింగ్ మొదలు కాబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ‘sum 30’ పాత్ర నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం తో ఆ పాత్రనే సినిమా నుండి తొలగించినట్టు వార్తలు వచ్చాయి. మరికొంత మంది అయితే , ఈ పాత్ర కోసం సాయి పల్లవి ని ఎంచుకున్నారు అంటూ ప్రచారం చేశారు. దీనిపై రీసెంట్ గానే నాగ్ అశ్విన్ స్పందించాడు. ‘sum 30’ పాత్రని తొలగించారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు , అదే విధంగా ఆ పాత్రని సాయి పల్లవి చేస్తుందంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవాలు లేవు, సరైన సమయం వచ్చినప్పుడు , ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ భాగం అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఇందులో ఆమె ‘sum 30’ పాత్ర పోషించలేదని , వేరే కీలక పాత్ర పోషించింది అని , ‘sum 30’ పాత్ర సాయి పల్లవి నే పోషించింది అంటూ ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే , ఈ చిత్రం లో సాయి పల్లవి నటించడంలేదు, ఇప్పుడు అలియా భట్ ఈ చిత్రం లో భాగం అయ్యింది అంటున్నారు , ఆమె పై కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారని అంటున్నారు. దీనిని బట్టీ చూస్తుంటే ‘sum 30’ పాత్రని అలియా భట్ పోషించి ఉంది ఉంటుందని , త్వరలోనే మేకర్స్ ఈ విషయం పై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు ఫ్యాన్స్.
