తెలుగు యంగ్ డైరెక్టర్.. మళ్ళీ బాలీవుడ్ లోనే.. !

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘సందీప్ వంగ’. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఏకంగా బాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే హిందీ నిర్మాతలు […]

Written By: admin, Updated On : June 17, 2020 10:11 am
Follow us on


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘సందీప్ వంగ’. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఏకంగా బాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

అయితే హిందీ నిర్మాతలు సందీప్ సినిమాకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తర్వాతి సినిమాను కూడా భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. వీరితోపాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.

ఇక సందీప్ తరువాత సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే అని, క్రైమ్ డ్రామాగా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి సందీప్ వంగ సినిమాలు భిన్నంగా ఉంటాయని బాలీవుడ్ మీడియా కూడా సందీప్ ను బాగానే ప్రమోట్ చేస్తోంది. సక్సెస్ వస్తే పొగుడుతారు. అదే ప్లాప్ వస్తే తిడతారు. ప్రస్తుతం ఫుల్ సక్సెస్ లో సందీప్ వంగని బాలీవుడ్ అక్కున చేర్చుకుంటుంది. మరి ఈ డైరెక్టర్ ఈ సక్సెస్ ను ఎంతకాలం కొనసాగిస్తాడో చూడాలి.