Jr Ntr: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 20 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వరదలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజల అనేక కష్టాలకు గురి అవుతున్నారు. వరద బాధితులకు కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే తాజాగా ఈ వరద బాధితులను ఆదుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయాన్ని ప్రకటించారు.
వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్ రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. వరదల వలన ఇబ్బందులు ఎదుర్కోంటున్న వారిని ఆదుకోవడానికి తన వంతు సాయం చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు తారక్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏపీ వరద బాధితులకు సాయం అందించేందుకు మొట్టమొదట స్పందించిన నటుడిగా ఎన్టీఆర్ నిలిచారు. కాగా అటు ఏపీ ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకునేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా మరణించిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది ప్రభుత్వం. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ తరఫున వరద బాధితులకు లక్ష రూపాయలు చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.
— Jr NTR (@tarak9999) December 1, 2021