Vijay and Trisha: మరో నెల రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల పై ఇప్పటి నుండే దేశమంతటా చర్చ సాగుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్(Thalapathy Vijay) పోటీ చేయబోతున్నాడు. రీసెంట్ గానే ఆయన తన పార్టీ TVK తరుపున పోటీ చేయబోతున్న మొదటి 50 మంది ఎమ్మెల్యేల జాబితాని కూడా విడుదల చేసాడు. ప్రధాన పార్టీలు కూడా ఇప్పటి వరకు తొలివిడత ఎమ్మెల్యేల జాబితాలను విడుదల చేయలేదు. అలాంటిది విజయ్ అందరికంటే ముందే ఈ జాబితాని విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది విజయ్ NDA తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఒంటరిగా పోటీ చేయడానికే మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. అందుకు సంకేతంగానే ఇప్పుడు తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేసాడు పవన్ కళ్యాణ్.
ఇది కాస్త పక్కన పెడితే రీసెంట్ గా విజయ్ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు రాజకీయంగా పెను దుమారమే రేపింది. ఆయన రాజకీయ భవిష్యత్తుని ప్రమాదం లోకి నెట్టేలా చేసింది. ఆయన సతీమణి సంగీత చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టు లో విడాకులు కావాలంటూ పిటీషన్ వేయడం, ఆ పిటీషన్ లో విజయ్ ఒక ప్రముఖ హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య సంగీత చెప్పడం, ఇది జరిగిన కొన్ని రోజులకే విజయ్ త్రిష తో కలిసి ఒక పెళ్ళికి హాజరవ్వడం వంటి సంఘటనలు పెను దుమారమే రేపాయి. సొంత అభిమానులు సైతం విజయ్ ని ఈ విషయం లో విమర్శించారు. అయితే విజయ్ అలా చెయ్యడానికి గల కారణం కూడా ఒకటి ఉందట. హీరోయిన్ త్రిష TVK పార్టీ ద్వారా చెన్నై సెంట్రల్ స్థానం నుండి పోటీ చేయబోతుంది. ఎలాగో ప్రజా జీవితం లోకి రావాలని అనుకుంటుంది కాబట్టి, ఈ రిలేషన్ ని ఇక దాచడం ఇష్టం లేక బయటపెట్టినట్టు తెలుస్తోంది.
Also Read: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. భజన తగ్గించకపోతే కష్టమే!
అంతే కాదు, అసలు విజయ్ ని పార్టీ పెట్టేలా చేసిందే త్రిష అట. మొదటి నుండి త్రిష కి రాజకీయాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. తమిళనాడు రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలను ప్రతీ రోజు గమనిస్తూనే ఉంటాను అంటూ త్రిష ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది, అంతే కాదు , ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రి కూడా అవ్వాలనే కోరిక ని కూడా ఆమె బయటపెట్టింది. అలా ఆమెకు మొదటి నుండి రాజకీయాలపై ఉన్న ఆసక్తి కారణంగానే విజయ్ తో పొలిటికల్ పార్టీ ని పెట్టించేలా చేసిందట. రీసెంట్ గానే త్రిష కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యిందట. రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి.