మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా?

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ ఇప్పటికే దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నహాలు చేస్తున్నాడు. అయితే తాజాగా మరో మెగా ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతోంది. Also Read: ప్రభాస్ సినిమాలో ప్రపంచ సుందరి ! ఆచార్య మూవీ తర్వాత […]

Written By: NARESH, Updated On : October 14, 2020 4:01 pm
Follow us on

 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ ఇప్పటికే దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నహాలు చేస్తున్నాడు. అయితే తాజాగా మరో మెగా ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతోంది.

Also Read: ప్రభాస్ సినిమాలో ప్రపంచ సుందరి !

ఆచార్య మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్’ లేదా ‘వేదాళం’ రీమేక్ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. లూసీఫర్ మూవీని దర్శకుడు వీవీ.వినాయక్ తెరక్కిస్తాడనే టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ ఠాగూర్.. ఖైదీ-150 వంటి బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చాయి. లూసీఫర్ మూవీలో కొన్నిమార్పులు చేర్పులు చేసి వినాయక్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా తమిళంలో సూపర్ డూపర్ హిట్టు సాధించిన ‘వేదాళం’ మూవీని దర్శకుడు మోహర్ రమేష్ తెరక్కించబోతున్నాడనే టాక్ విన్పిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంపై అభిమానుల్లో ఒకింత భయాందోళన నెలకొంది. అయితే మెగాస్టార్ మాత్రం మోహర్ రమేష్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని మోహన్ రమేష్ సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు.

మోహర్ రమేష్-ఏకే ఎంటర్టైన్మెంట్స్ కాంబోలో ‘వేదాళం’ రీమేక్ తెరకెక్కించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈనెలఖారులో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. దీంతో లూసీఫర్ కంటే ముందుగానే వేదాళం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్లో మెగా హీరోయినే నటించనుండటం ఆసక్తిని రేపుతోంది.

Also Read: వర్మ జిమ్మిక్కులు.. జనాలకు తెలిసిపోయిందా?

ఫిదా మూవీలో వరుణ్ తేజ్ సరసన నటించిన సాయిపల్లవి తొలి మూవీతోనే మెగా కాంపౌండ్లోకి అడుగుపెట్టింది. అలాగే కీర్తి సురేష్ పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’లో నటించి మెగా హీరోయిన్ గా మారింది. వీరిద్దరిలో ఒకరికి మెగాస్టార్ చెల్లెలుగా నటించే అవకాశం దక్కబోతుంది. ఈమేరకు దర్శకుడు వీరిద్దరికి కథను విన్పించినట్లు తెలుస్తోంది.

వీరిద్దరిలో ఎవరు నటిస్తే సినిమాకు క్రేజ్ వస్తుందో మెగాస్టార్ డిసైడ్ చేయనున్నారట. మెగాస్టార్ సూచించిన హీరోయిన్ కే ఆఫర్ దక్కనుందనే టాక్ విన్పిస్తోంది. ఈ సినిమాలో చెల్లెలి క్యారెక్టర్ చాలా ఇపార్టెంట్ అని తెలుస్తోంది. దీంతో ఏ ‘మెగా’ హీరోయిన్ మెగాస్టార్ చెల్లెలిగా నటించే అవకాశం దక్కుతుందనేది ఆసక్తిని రేపుతోంది.