ప్రభాస్ మూవీలో అమితాబ్.. పారితోషికం అంతనా?

వైజయంతీ మూవీస్ బ్యానర్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఓ  ఈ మూవీని తెరక్కిస్తున్నాడు. సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్లో నిర్మించబోతున్నాడు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ క్రేజీగా మారుతోంది. Also Read: మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా? నాగ్ అశ్విన్ తెరకెక్కించే మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ […]

Written By: NARESH, Updated On : October 14, 2020 4:39 pm
Follow us on

వైజయంతీ మూవీస్ బ్యానర్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఓ  ఈ మూవీని తెరక్కిస్తున్నాడు. సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్లో నిర్మించబోతున్నాడు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ క్రేజీగా మారుతోంది.

Also Read: మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా?

నాగ్ అశ్విన్ తెరకెక్కించే మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ స్టార్లతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. ప్యాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తీర్చిదిద్దబోతున్నారు. ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ ఓ స్పెషల్ చేయబోతున్నాడనే టాక్ విన్పిస్తోంది. బిగ్ బి అడిగినంత పారితోషికాన్ని ఇచ్చేందుకు చిత్రయూనిట్ సిద్ధమైందని సమాచారం.

ఈ మూవీలో అమితాబ్ పాత్ర దాదాపు 25నిమిషాలపాటు ఉంటుందని సమాచారం. ఇందుకోసం నిర్మాతలు అమితాబ్ కు రూ.25కోట్ల మేరకు పారితోషికం ఇవ్వనున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. అదేవిధంగా ఆయనకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముంబైలో చిత్రీకరిస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ హామీ ఇచ్చారట. దీంతో ఈ మూవీలో నటించేందుకు బిగ్ బీ అంగీకరించినట్లు తెలుస్తోంది. బిగ్ బీ ఈ మూవీలో నటిస్తే హిందీ మార్కెట్ బాగుంటుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

Also Read: ప్రభాస్ సినిమాలో ప్రపంచ సుందరి !

ప్రభాస్-దీపిక పదుకోనే కాంబోతో ఇప్పటికే సౌత్ ఇండియాలో భారీ క్రేజీ ఏర్పడింది. అమితాబ్ ఎంట్రీతో ఉత్తరాదిన కూాడా ఈ మూవీకి శాటిలైట్.. డిజిటల్ రూపంలో భారీ ధర పలుకుతుందని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ విన్పిస్తోంది.