Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ ఏం చేసినా సంచలనమే. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించే రకం కాదు. సోషల్ మీడియా జనాలు ఎంతగా ట్రోల్ చేస్తున్నా… అసలు తగ్గదు. ఇంకా వాళ్ళను రెచ్చగొట్టేలా పోస్ట్స్ పెడుతుంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా చర్చకు దారి తీశాయి. మేకప్ లేకుండా చిన్నబట్టల్లో కాఫీ తాగుతూ కనిపించి షాక్ ఇచ్చింది. అనసూయ జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. 2013లో తెలుగులో జబర్దస్త్ కామెడీ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. యాంకర్ గా అనసూయ ఎంపికైంది. అనసూయ స్కిన్ షో చేయడం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది.
ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ వెనక్కి తగ్గలేదు. నా బట్టలు నా ఇష్టం,నన్ను ప్రశ్నించడానికి మీరెవరు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఏళ్ల తరబడి జబర్దస్త్ లో అనసూయ ప్రయాణం సాగింది. 2022లో ఈ కామెడీ షో నుండి తప్పుకుంది. నటిగా బిజీ కావడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. కాగా అనసూయ డ్రెస్సింగ్ ని ఎంత ట్రోల్ చేసినా ఆమె తగ్గదు.
తాజాగా ఆమె షార్ట్ ధరించి తన ప్రైవేట్ ఫోటోలు షేర్ చేసింది. సాగర తీరానికి వెకేషన్ కి వెళ్లిన అనసూయ కిటికీ వద్ద కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగింది. మేకప్ లేకుండా పొట్టి లాగు ధరించి కవ్వించే ఫోజుల్లో ఫోటోలు దిగింది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో జనాలు అవాక్కు అయ్యారు. ఎవరూ లేనప్పుడు అనసూయ ఇలా ఉంటుందా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా అనసూయ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే.
గత ఏడాది అనసూయ రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ ఆమె పుష్ప 2లో లేడీ విలన్ గా కనిపించనుంది. దాక్షాయణి పాత్రలో అలరించనుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. పుష్ప 2తో పాటు పలు చిత్రాలు అనసూయ ఖాతాలో ఉన్నట్లు సమాచారం. అనసూయ భర్త పేరు సుశాంక్ కాగా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు.