Nainisha Rai: బ్రహ్మముడి సీరియల్ నైనీషా రాయ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో శ్రీమంతుడు, భాగ్య రేఖ,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇంటి గుట్టు, హంస గీతం వంటి సీరియల్స్ లో నటించి పాపులారిటీ సంపాదించింది. ఇక బ్రహ్మముడి సీరియల్ లో అప్పుగా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇందులో మగరాయుడిలా ఉంటూ తేడాలొస్తే ఎవ్వరికైనా చుక్కలు చూపిస్తుంది. అబ్బాయి లాగా ప్యాంటు షర్టు వేసుకుని రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తుంది.
కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన నైనీషా తన రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి పంచుకుంది. ఆమె మాట్లాడుతూ .. నేను మిర్రర్ లాంటి దాన్ని కోపం చూపిస్తే కోపం… ప్రేమ చూపిస్తే ప్రేమ చూపిస్తాను. కాలేజీ లైఫ్ లో చాలా మందికి ధమ్కీలిచ్చాను. ఒకడు యాసిడ్ పోస్తానని బెదిరించాడు. వాడి తల పగలకొట్టాను. ఆ తర్వాత నేనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను అని నైనీషా చెప్పింది.
అయితే టీనేజ్ లోనే నైనీషా పేరెంట్స్ కి దూరంగా వచ్చేసిందట. ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఇంటి నుంచి పారిపోయిందట. స్టడీస్ కోసం హైదరాబాద్ వస్తే తన ఫ్రెండ్ ద్వారా ఓ ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారట. అలా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో విలన్ రోల్ ఆఫర్ వచ్చిందట. ఆ తర్వాత ‘కథానికా’, ‘ ప్లాన్ బి ‘, కిడ్నాప్ సినిమాల్లో నటించిందట. ఇక కోవిడ్ టైం లో శ్రీమంతుడు సీరియల్ లో లీడ్ రోల్ వచ్చిందట. అందులో నైనీషా ఎప్పుడూ ఏడుస్తూ ఉండే ఓ సాఫ్ట్ క్యారక్టర్ లో నటించిందట.
ఆమెకు తెలుగు తో పాటు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, ఒరియా భాషలు మాట్లాడగలదట. తమిళ్ లో ఆఫర్స్ వచ్చినప్పటికీ అక్కడ వాళ్లంతా కొత్త వాళ్ళు కావడంతో ఇబ్బందిగా అనిపించిందట. రెండు రోజులు షూటింగ్ తర్వాత అక్కడి నుంచి వచ్చేసిందట. ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం వచ్చిందట. ఇష్టం లేకుండా సీరియల్ ఒప్పుకున్నప్పటికీ, అదే నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అంటూ నైనీషా రాయ్ చెప్పుకొచ్చింది.