ముస్తాఫా రాజ్ – ప్రియమణి వివాహం చెల్లదంటూ ముస్తాఫా రాజ్ మొదటి భార్య అయేషా కాస్త గట్టిగా వాదిస్తోంది. ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ఇలా లాజిక్ లు తీస్తూ వివరణ ఇస్తోంది అయేషా. అయితే, తాజాగా అయేషా వాదన పై ప్రియమణి పరోక్షంగా అలాగే కాస్త తెలివిగా కూడా కామెంట్స్ చేసింది.
అవేంటో ప్రియమణి మాటల్లోనే ‘మనుషుల మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఈ మధ్య ఎక్కువగా నాకు, ముస్తాఫాకు మధ్య ఉన్న రిలేషన్ పై చాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి నన్ను అడిగితే.. నేను – ముస్తాఫా చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటున్నాం. అలాగే ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.
ప్రస్తుతం నా భర్త అమెరికాలో ఉన్నారు. అయినా ప్రతి రోజు మేము ఫోన్ లో మాట్లాడుకుంటూ అన్ని విషయాలను పంచుకుంటాం. కుదరకపోతే కనీసం హాయ్, బాయ్ అయినా చెప్పుకుని ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తాం. ఇలా ప్రతి రోజు మా మధ్య బంధం పెరుగుతూనే ఉంది. కొంతమంది మా బంధం పై వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజం కావు. అలాగే వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం’ అంటూ ప్రియమణి తనదైన శైలిలో చెప్పుకొచ్చింది.