Mahesh-Rajamouli movie : మహేష్-రాజమౌళి మూవీలో హాలీవుడ్ నటులు… షూటింగ్ ఎక్కడో తెలుసా?

ఇక మహేష్ మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. కాబట్టి హాలీవుడ్ నటులు నటించడం అనివార్యం.

Written By: NARESH, Updated On : August 24, 2023 9:19 pm
Follow us on

Mahesh-Rajamouli movie : మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది SSMB 29. రాజమౌళి ఏకంగా రూ. 800 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ చేయనున్నారు. రాజమౌళి కెరీర్లో కూడా ఇది భారీ బడ్జెట్ మూవీ. రాజమౌళి గత చిత్రాల బడ్జెట్ రూ. 500-600 కోట్ల కంటే తక్కువే. మహేష్ బాబుతో రాజమౌళి పదేళ్ల క్రితమే మూవీ చేయాల్సింది. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఆలస్యం అయినప్పటికీ రాజమౌళితో హాలీవుడ్ రేంజ్ మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.

ఇక ఈ మూవీలో హాలీవుడ్ నటులు నటిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈ ప్రాజెక్ట్ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన ఆ అవకాశం ఉందని అన్నారు. మహేష్ మూవీ ఆఫ్రికా దేశంలో చిత్రీకరించాల్సి ఉంది. కాబట్టి హాలీవుడ్ నటులు నటించే ఛాన్స్ ఉందన్నారు. అయితే ఇంకా ఎవరినీ సంప్రదించలేదని చెప్పారు. అప్పుడే ఈ సినిమా గురించి ఇంత కంటే ఎక్కువ చెప్పకూడదని ఆయన అన్నారు. స్క్రిప్ట్ రాసిన వాడిగా మహేష్ మూవీలో పాత్రలపై ఆయనకు అవగాహన ఉంటుంది.

కాబట్టి ఆయన మాటల ప్రకారం మహేష్-రాజమౌళి మూవీలో హాలీవుడ్ నటులు నటించడం ఖాయం. ఇంకా షూటింగ్ కి సమయం ఉన్న నేపథ్యంలో రాజమౌళి ఎవరితో చర్చ జరపలేదు. రాజమౌళి గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ ఒలీవియా మోరిస్ తో పాటు మెయిన్ విలన్, విలన్ భార్య పాత్రలకు హాలీవుడ్ నటులను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ మూవీ ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. కాబట్టి హాలీవుడ్ నటులు నటించడం అనివార్యం.

వచ్చే ఏడాది ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది. నాలుగు కోట్లతో స్పెషల్ సెట్ వేశారని సమాచారం. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం షూటింగ్ అనుకున్న ప్రకారం జరగడం లేదు. దీంతో సంక్రాంతి రావడం కష్టమే అంటున్నారు. చెప్పినట్లు గుంటూరు కారం సంక్రాంతి బరిలో దిగుతుందని మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.