Nanditha Raj: ‘ప్రేమ కథా చిత్రమ్’ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..? ఇప్పుడు ఆమె ఎక్కడుందో, ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. రెండవ సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిందంటే ఆమె టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకు మలయాళం లో పృథ్వీ రాజ్ సుకుమార్ నటించిన 'లండన్ బ్రిడ్జ్' అనే చిత్రంలో హీరోయిన్ నటించే అవకాశం దక్కింది.

Written By: Vicky, Updated On : October 16, 2024 3:59 pm

Nanditha Raj

Follow us on

Nanditha Raj: తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న కొంతమంది హీరోయిన్స్ ని చూసి, భవిష్యత్తులో వీళ్లకు తిరుగులేదు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేనికైనా అదృష్టం ఉండాలి, టాలెంట్, అందం ఉంటే సరిపోదు. అదృష్టం ఉంటే ఆ రెండు లేకపోయినా కూడా ఇండస్ట్రీ లో నెట్టుకొని రావొచ్చు. ఇది వరకు మనం అలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాము. అలాంటి ఉదాహరణలలో ఒకటిగా మిగిలిపోయింది ‘ప్రేమ కథా చిత్రమ్’ హీరోయిన్ నందితా రాజ్ సినీ కెరీర్. ఈమె ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ అనే చిత్రమ్ ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ, నందిత రాజ్ లో మంచి నటన, అందం ఉండడంతో ‘ప్రేమ కథా చిత్రమ్’ లో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి మొదటి కారణం నందిత రాజ్ నటన అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అందుకే ఆమెకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. రెండవ సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిందంటే ఆమె టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకు మలయాళం లో పృథ్వీ రాజ్ సుకుమార్ నటించిన ‘లండన్ బ్రిడ్జ్’ అనే చిత్రంలో హీరోయిన్ నటించే అవకాశం దక్కింది. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఈమె తెలుగు లో ‘లవర్స్’ అనే చిత్రం చేసింది. ఇది కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఆమెకి ఆ తర్వాత ఫ్లాప్స్ రావడం మొదలైంది. మధ్యలో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ, నందిత రాజ్ కి పెద్దగా గుర్తింపు తీసుకొని రాలేదు. ఈమె వెండితెర మీద చివరిసారిగా కనిపించిన చిత్రం ‘విశ్వామిత్ర’. 2019 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

ఇక ఆ తర్వాత ఈమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. అసలు ఈ అమ్మాయి ఏమైంది?, ఎక్కడ ఉంది?, ఏమి చేస్తుంది అనే విషయం ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉండడం చాలా తక్కువ. అయితే ఈమె గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా, ఈమె సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి మాస్టర్స్ చదివేందుకు విదేశాలకు వెళ్లిందని తెలుస్తుంది. అయితే ఈమెకు ఇంస్టాగ్రామ్ లో ఒక అకౌంట్ ఉంది, కానీ యాక్టీవ్ గా లేదు. అయితే రీసెంట్ గానే ఆమె నాలుగు రోజుల క్రితం కొన్ని ఫోటోలు అప్లోడ్ చేసింది. అప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చిందో మీరే చూడండి.