Mahesh Babu- Rajasekhar: రాజశేఖర్ మహేష్ సినిమాలో కన్ఫర్మ్.. దశ తిరుగుతుందా !

Mahesh Babu- Rajasekhar: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సినిమాలో రాజశేఖర్ పాత్ర విషయానికి వస్తే.. మహేష్ కి బాబాయ్ పాత్ర అట. […]

Written By: Shiva, Updated On : May 10, 2022 12:44 pm
Follow us on

Mahesh Babu- Rajasekhar: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సినిమాలో రాజశేఖర్ పాత్ర విషయానికి వస్తే.. మహేష్ కి బాబాయ్ పాత్ర అట. ఎప్పటి నుంచో రాజశేఖర్ సైడ్ క్యారెక్టర్స్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. కాకపోతే.. ఓ మంచి రోల్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాడు. మరి, త్రివిక్రమ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కి కూడా విలువ ఉంటుంది కాబట్టి.. రాజశేఖర్ కి కాలం కలిసి వస్తోందేమో చూడాలి.

Mahesh Babu- Rajasekhar

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. జులై నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు. పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి.

Also Read: Priyanka Mohan: గుడ్డిగా అడిగేస్తోంది.. ఇలా అయితే ఎలా అమ్మడు ?

కానీ, ఈ యాక్షన్ డ్రామాని మహేష్ ఇష్టపడలేదు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి మహేష్ ఒప్పుకుంటాడా ? ఎలాగూ మాటలతో కన్విన్స్ చేయడం త్రివిక్రమ్ కి పెన్ తో పెట్టిన విద్య. మరి ఈ మాటల మాంత్రికుడు ఈసారి తన విద్యను ఎంతవరకు ప్రయోగిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు.

Mahesh Babu- Rajasekhar

సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం. మరో కథానాయికగా పూజా హెగ్డేనే తీసుకోవాలని త్రివిక్రమ్ ఆశ పడుతున్న వ్యవహారం గురించి తెలిసిందే.

ఏది ఏమైనా త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాకు రూ. 200 కోట్లు మినిమం బడ్జెట్‌ అయిపోయింది. ఎలాగూ మహేష్‌ రెమ్యునరేషన్‌ రూ. 60 కోట్లు వరకు ఉంటుంది. మరోపక్క అల వైకుంఠపురములో.., భీమ్లా నాయక్‌ తో త్రివిక్రమ్‌ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేశాడు. ఈ లెక్కన సినిమాకి రూ.250 కోట్లు కనీస బడ్జెట్ అయ్యేలా ఉంది.

Trivikram

ఇక ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

Also Read:Janasena office for sale : అరే..! ఏంట్రా ఇదీ.. అమ్మకానికి జనసేన ఆఫీస్.. ధర ఎంతో తెలుసా? 
Recommended Videos


Tags