Arjuna Phalguna: ఆ హీరో సినిమా టీజర్ కి రానా అభినందన… న్యూ వెరైటీకి సెల్యూట్ అంటూ ట్వీట్

Arjuna Phalguna: విభిన్న పాత్రలు, బ్వినూత్న కధలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఇప్పుడు మరొకసారి డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ యంగ్ హీరో. శ్రీ విష్ణు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీకి  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ మర్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 9, 2021 5:19 pm
Follow us on

Arjuna Phalguna: విభిన్న పాత్రలు, బ్వినూత్న కధలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఇప్పుడు మరొకసారి డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ యంగ్ హీరో. శ్రీ విష్ణు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీకి  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ మర్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ టీజర్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ టీజర్ లో శ్రీ విష్ణు ఊర మాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. అలానే ఈ సినిమాలో శ్రీ విష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానిగా కనిపించనున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఈ సినిమాపై ఇంటరెస్ట్ ఏర్పడింది అని చెప్పాలి. అయితే విడుదల అయిన ఈ టీజర్ పై ప్రముఖ టాలివుడ్ నటుడు రానా దగ్గుపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. “అద్దిరి పోయింది గా, న్యూ వెరైటీ కి సెల్యూట్” అంటూ చెప్పుకొచ్చారు. రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం లో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తుండగా, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కాశి రెడ్డి, చైతన్య గరికిపాటి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

https://twitter.com/RanaDaggubati/status/1457974720989523968?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1457974720989523968%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-1586581243000436250.ampproject.net%2F2110212130002%2Fframe.html

కాగా ఈ సినిమాకు ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.