తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అంటే తెలియని వారుండరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని టీడీపీలో చంద్రబాబుకు అనుయాయుడిగా వ్యవహరించేవారు. రాష్ట్ర విభజన సమయం వరకు ఆయన టీడీపీలోనే ఉంటూ పార్టీ కోసం ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నాడు. అయినా పార్టీని వీడలేదు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత మోత్కుపల్లి నర్సింహులు పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడా..? అనే చర్చ సాగుతోంది. Also Read: విశాఖ […]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అంటే తెలియని వారుండరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని టీడీపీలో చంద్రబాబుకు అనుయాయుడిగా వ్యవహరించేవారు. రాష్ట్ర విభజన సమయం వరకు ఆయన టీడీపీలోనే ఉంటూ పార్టీ కోసం ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నాడు. అయినా పార్టీని వీడలేదు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత మోత్కుపల్లి నర్సింహులు పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడా..? అనే చర్చ సాగుతోంది.
Also Read: విశాఖ మెట్రో ప్రారంభం..
రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి ఓ వైపు చంద్రబాబుకు సపోర్టుగానే ఉంటూ మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతునిచ్చాడు. అయితే టీఆర్ఎస్ గాలిలో టీడీపీ కొట్టుకుపోవడంతో టీడీపీ నాయకుల ప్రాధాన్యం తగ్గింది. ఈ నేపథ్యంలో కొందరు పార్టీని వీడి టీఆర్ఎస్లోకి మారారు. కానీ మోత్కుపల్లి మాత్రం టీడీపీలోనే ఉంటూ పార్టీ తరుపున పనిచేశారు.
చంద్రబాబుపై వచ్చే ప్రతి విమర్శను తిప్పికొడుతూ నిత్యం వార్తల్లో ఉండే ఆయన ఇప్పుడు కనీసం ప్రెస్మీట్లో కూడా కనిపించడం లేదు. 2014లో విభజన ఆంధ్రలో టీడీపీ విజయం సాధించడంతో కనీసం నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి పదవి ఆశించిన ఆయనను చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో తీవ్రంగా నిరాశ చెందారు. మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని చంద్రబాబుపై విమర్శలు చేశారు. దీంతో పార్టీ ఆయనను బహిష్కరించింది.
Also Read: ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్..
ఆ తరువాత పార్టీని వీడి బీజేపీలోకి మారారు. కానీ బీజేపీలో వెళ్లినప్పటి నుంచి మోత్కులపల్లి ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కొన్నిరోజులు కిందట ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అదికూడా దక్కకపోవడంతో పూర్తిగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నారా..? అనే చర్చ సాగుతోంది. అయితే మోత్కులపల్లి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి మరి..