Rajamouli’s comments on Mahatma Gandhi: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది విడుదలై అది సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదలైన అన్ని భాషలకు కలిపి ఈ సినిమా సుమారుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 3 ఇండియన్ మూవీ లో ఒకటిగా నిలిచింది..ఇక OTT లో విడుదలైన తర్వాత ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఊహాతీతం..నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం హిందీ వెర్షన్ ని విడుదల చెయ్యగా దానికి వంద మిళియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
కేవలం ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో అమెరికన్లు ఎగబడి చూసారు..ఇతర దేశాలలో ఉండే ప్రేక్షకుల నుండి అనూహ్యమైన ఆదరణ రావడం తో ఈ సినిమాని ఇటీవలే జపాన్ లో ఘనంగా విడుదల చేసారు..ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ -ఎన్టీఆర్ – రాజమౌళి ప్రొమోషన్స్ లో భాగంగా జపాన్ మీడియా మొత్తాన్ని చుట్టేశారు..అంతే కాకుండా అక్కడ ఉన్న అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు..థియేటర్స్ కి కూడా వెళ్లారు.
అయితే ఈ ప్రొమోషన్స్ లో పాల్గొన్న రాజమౌళి కి అక్కడి మీడియా నుండి ఒక ప్రశ్న ఎదురు అయ్యింది..అదేమిటి అంటే ఈ చిత్రం ముగింపు లో వచ్చే ‘ఎత్తర జెండా’ పాట మన అందరికి గుర్తు ఉండే ఉంటుంది..ఈ పాటలో స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో వీరోచితంగా పోరాడి ప్రాణాలను వదిలిన యోధులను చూపిస్తే వాళ్లకి నివాళి అర్పిస్తారు..అయితే ఈ యోధులలో మహాత్మా గాంధీజీ ఎందుకు లేదు..మీకు గాంధీ గారంటే ఇష్టం లేదా అని జపాన్ మీడియా అడిగిన ప్రశ్న కి రాజమౌళి సమాధానం చెప్తూ ‘మహాత్మా గాంధీ గారు అంటే నాకు ఎంతో ఇష్టం..అహింస మార్గంలో వెళ్లి స్వతంత్రం సాధించిన మహానుభావుడు ఆయన..కానీ ఆయన శాంతికి చిహ్నం లాంటి వాడు..కానీ మా సినిమాలో హీరోలు అహింస పద్దతి ద్వారా స్వతంత్రం సాధించిన వాళ్ళు..ఎంతో మంది బ్రిటిష్ దొరలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలను అర్పించారు..అందుకే వాళ్ళ ఫోటోలు మాత్రమే పెట్టాము’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. మహాత్ముడి మార్గంపై రాజమౌళి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.