Ram Charan Upasana Twins: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ విజయాలను సాధించి పెట్టాయి… ఇక రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. అందులో ఒకరు అబ్బాయి కాగా, మరొకరు అమ్మాయి కావడం విశేషం…ఇక తన వారసుడు వచ్చాడు అంటూ రామ్ చరణ్, అలాగే మెగా ఫ్యామిలీలో మరో హీరో పుట్టాడు అంటూ చిరంజీవి సైతం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పేరు పెట్టడానికి ప్రముఖ సిద్ధాంతి అయిన మహేష్ బాగ్ ను సంప్రదించారు. ఆయన అన్ని సక్రమంగా చూసుకొని ఒక పేరు నిర్దేశించినట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి తగ్గట్టుగానే రామ్ చరణ్ కి పుట్టిన ఇద్దరి పిల్లల జాతకం చూసినందుకు గాను ఆయన 3 లక్షల రూపాయలను ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. సామాన్యులు ఆయన్ను భరించలేరు. కేవలం 30 నిమిషాల పాటు వాళ్ళ జాతకాన్ని చూసినందుకే మూడు లక్షల రూపాయలను ఛార్జ్ చేశారు అంటే మామూలు విషయం కాదు.
మెగా ఫ్యామిలీకి తను మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో జ్యోతిష్యం చూసుకుంటూ వస్తున్నాడు. ప్రతి విషయాన్ని చిరంజీవి అతనికి చూపించిన తర్వాతే తను ముందుకు అడుగులు వేస్తున్నాడు. మొత్తానికైతే మహేష్ బాగ్ జ్యోతిష్యం బాగా చెబుతారనే ఉద్దేశ్యంతోనీ అతన్ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీ లో ఉన్న లోటైతే తీరిపోయింది అని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఇక చిరంజీవి సైతం ఇప్పుడు చాలా సంతోషం గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సక్సెస్ ని సాధించడం ఒక ఒకెత్తయితే తనకి మనవడు పుట్టాడనే ఆనందం మరొక ఎత్తుగా మారింది…