ఆంధ్రప్రదేశ్‌స్వరూపానందకు ఆ ‘మర్యాద’

స్వరూపానందకు ఆ ‘మర్యాద’

swaroopanandendra

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేయడం పెద్ద వివాదం అయ్యింది. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అదనపు కమిషనర్‌ ఆ ఆదేశాలు జారీచేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కీలకమైన, సున్నితమైన విషయంలో ఉన్నతాధికారులను సంప్రదించకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంతా జరగడానికి అదనపు కమిషనర్‌ స్థాయిలో ఆదేశాలు ఇవ్వడమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: ఏపీలో రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్.. మార్పులు ఇవే!

తాజాగా దీనిపై దేవదాయశాఖ అదనపు కమిషనర్‌-2కు షోకాజు నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. కీలకమైన అంశంలో ఎవరికీ చెప్పకుండా సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ వివరణ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కమిషనర్‌ తర్వాత స్థానంలో ఉండే అదనపు కమిషనర్‌కు షోకాజు నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి.

ఈనెల 18న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆలయ మర్యాద చేయాలంటూ పీఠం దేవదాయశాఖను కోరింది. దానికి స్పందించిన ఆ శాఖ అదనపు కమిషనర్‌-2 రామచంద్రమోహన్‌ కమిషనర్‌ను సంప్రదించకుండా రాష్ట్రంలోని 23 ఆలయాలకు ఆదేశాలు ఇచ్చారు.

రామచంద్ర మోహన్‌పై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. సింహాచలం భూముల విషయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. అలాగే మన్సాస్‌ ట్రస్టు ఈవోగా ఉన్నప్పుడు తూర్పుగోదావరిలో ట్రస్టు పరిధిలో ఉన్న భూముల్లోని ఇసుక తవ్వకా ల్లో అక్రమాలు జరిగాయని గతంలో దేవదాయశాఖ అధికారే లేఖ రాశారు.

ఈ క్రమంలోనే తాజా వివాదం వెలుగులోకి రావడం తో ఆయనపై కఠిన చర్యలే ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. జగన్‌కు స్వరూపానంద సన్నిహితంగా ఉంటారనేది తెలిసిన విషయమే. అయితే దేవదాయశాఖలోని కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని వ్యక్తిపూజకు ప్రాధాన్యమిస్తున్నారు.తరచూ శారదా పీఠానికి వెళ్ళడం, అక్కడి ఆశీస్సులు తమకున్నాయనే ప్రచారం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వపెద్దలనూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Also Read: కాంగ్రెస్ తో జగన్ పొత్తు.. ఊ కొడుతారా..? ఛీ కొడుతారా..?

ఈ వివాదం పై ప్ర‌తిప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ట, లౌకిక విలువల్ని దిగజారుస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు. జగన్‌ తన స్వామి భక్తి కోసం 5కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చటం కొందరూ అంటున్నారు.

దేవాలయాలు, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సంప్రదాయాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమని అంటున్నారు. స్వరూపానందపై అంత ప్రేమ ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలే తప్ప .. అధికార దుర్వినియోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చినజీయర్‌స్వామి, కంచి కామకోటి పీఠాధిపతిలాంటి ఇతర స్వామీజీల పుట్టినరోజులకు లేని మర్యాదలు స్వరూపానందకు చేయడం వారందరినీ కించపరచడమేనని విమర్శలు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version