ఏ స్థానంలో ఆడమన్నా ఓకే: రోహిత్ శర్మ

త్వరలో జరిగే ఆస్ట్రేలియా టోర్నీలో ఏ స్థానంలో ఆడమన్నా ఆడుతానని టీమిండియా బ్యాట్సమెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. జట్టు అవసరాలను భట్టి తన ఓపెనర్ స్థానాన్ని మళ్లీ మారుస్తారా..? లేదా..? అనే విషయం తెలియదన్నారు. ఆదివారం రోహిత్ పీఈటీ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అస్ట్రేలియాలో ఎవరెవరు ఎలా ఆడాలన్నదానిపై ఇప్పటికే మాకు అవగాహన ఉందన్నారు. అయితే అక్కడికి వెళ్లాకే స్పష్టత వస్తుందన్నారు. అస్ట్రేలియా పిచ్ పై పెద్దగా బౌన్స్ ఉండదన్నారు. మెల్బోర్న్, […]

Written By: Suresh, Updated On : November 22, 2020 2:54 pm
Follow us on

త్వరలో జరిగే ఆస్ట్రేలియా టోర్నీలో ఏ స్థానంలో ఆడమన్నా ఆడుతానని టీమిండియా బ్యాట్సమెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. జట్టు అవసరాలను భట్టి తన ఓపెనర్ స్థానాన్ని మళ్లీ మారుస్తారా..? లేదా..? అనే విషయం తెలియదన్నారు. ఆదివారం రోహిత్ పీఈటీ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అస్ట్రేలియాలో ఎవరెవరు ఎలా ఆడాలన్నదానిపై ఇప్పటికే మాకు అవగాహన ఉందన్నారు. అయితే అక్కడికి వెళ్లాకే స్పష్టత వస్తుందన్నారు. అస్ట్రేలియా పిచ్ పై పెద్దగా బౌన్స్ ఉండదన్నారు. మెల్బోర్న్, సిడ్నీ పిచ్లో సాధారణంగానే ఉంటాయన్నారు. కాగా అనుష్క డెలవరీ సందర్భంగా ఈ టోర్నీలో కోహ్లీ ఆడడం లేదు.