‘రాధేశ్యామ్’పై కాపీ మరక.. కౌంటర్ ఇవ్వరా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ మూవీ చేస్తున్నప్పుడే యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో మరో మూవీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాటి నుంచి ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ప్రభాస్ చిత్రాన్ని ‘రాధేశ్యామ్’ టైటిల్ ఇటీవలే ఖరారైంది. Also Read: టాలీవుడ్ బుట్టబొమ్మ.. బాలీవుడ్లో ‘సర్కస్’ చేయనుందా? ‘రాధేశ్యామ్’ టీంపై మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ‘సాహో’ చిత్రానికి యూవీ క్రియేషన్స్ సరైన పబ్లిసిటీ చేయలేదని.. అందువల్లే ఆ […]

Written By: NARESH, Updated On : October 20, 2020 4:51 pm
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ మూవీ చేస్తున్నప్పుడే యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో మరో మూవీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాటి నుంచి ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ప్రభాస్ చిత్రాన్ని ‘రాధేశ్యామ్’ టైటిల్ ఇటీవలే ఖరారైంది.

Also Read: టాలీవుడ్ బుట్టబొమ్మ.. బాలీవుడ్లో ‘సర్కస్’ చేయనుందా?

‘రాధేశ్యామ్’ టీంపై మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ‘సాహో’ చిత్రానికి యూవీ క్రియేషన్స్ సరైన పబ్లిసిటీ చేయలేదని.. అందువల్లే ఆ చిత్రాన్ని అనుకున్నంతగా విజయం సాధించలేదనే టాక్ అభిమానుల్లో ఉంది. ఇక తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ విషయంలో చిత్రబృందం అదేమాదిరిగానే వ్యవహరిస్తుండటంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్’ చిత్రయూనిట్ ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తానని ప్రకటించింది. రెండేళ్లుగా షూటింగు జరుపుకుంటున్న ‘రాధేశ్యామ్’ టీజరో.. ట్రైలరో రిలీజ్ చేయకుండా కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఏంటనే సందేహాలను ప్రభాస్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ టీం సినిమాను సరిగ్గా షూట్ చేస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘రాధేశ్యామ్’ టీం ఈనెల 23న మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనుండగా అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్ ను చిత్రబృందం కాపీ కొట్టిందని కొన్నిగంటల వ్యవధిలోనే తేలిపోయింది. ఇందుకు సంబంధించిన ఒరిజినల్ పిక్ ను నెటిజన్లు బయటికి తీసి ‘రాధేశ్యామ్’ పరువు మొత్తం తీసేస్తున్నారు.

Also Read: మీడియా వర్సెస్ బాలీవుడ్.. చివరికీ ఏం కానుంది?

‘రాధేశ్యామ్’ నుంచి విడుదలైన పోస్టర్లో.. పాత కాలం నాటి రైలు బండి దట్టమైన పొగతో చిమ్ముతూ ట్రాక్ పై నుంచి బయటికి వస్తూ కన్పిస్తూ ఉంటుంది. ఈ దృశ్యం చుడటానికి కనువిందుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఒరిజినల్ పిక్ నెటిజన్లు బయటికి తీశారు.

‘రాధేశ్యామ్’ విడుదల చేసిన పోస్టర్ కు నెటిజన్లు బయటికి తీసుకొచ్చిన ఫోటో ఒకేతీరులో ఉంది. కాకపోతే రాధేశ్యామ్ టీం కొత్త ఫొటోషాప్ వర్క్ చేసి కలరింగ్ ఇచ్చినట్లు కన్పిస్తోంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ పై గుర్రుగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ తాజా కాపీ మరక వారిని మరింత చికాకు గురిచేస్తోంది. ఈ కాపీ మరకను ‘రాధేశ్యామ్’ టీం ఎలా తొలగించుకుంటుందో వేచిచూడాల్సిందే..!