Rakul Preeth Singh: నటి రకుల్ నివసిస్తున్న బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం…

Rakul Preeth Singh: వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​లో హీరోయిన్​గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది రకుల్​. ఇటీవలే జాకీ భగ్నానితో రిలేషన్​లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, వీరిద్దరు పెళ్లికి సంబంధించి సన్నాహాలు  కూడా మొదలు పెట్టినట్లు సమాాచారం. అయితే తాజాగా  రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబై లోని ఈ బిల్డింగ్‌లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు […]

Written By: Raghava Rao Gara, Updated On : November 20, 2021 7:42 pm
Follow us on

Rakul Preeth Singh: వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​లో హీరోయిన్​గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది రకుల్​. ఇటీవలే జాకీ భగ్నానితో రిలేషన్​లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, వీరిద్దరు పెళ్లికి సంబంధించి సన్నాహాలు  కూడా మొదలు పెట్టినట్లు సమాాచారం. అయితే తాజాగా  రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబై లోని ఈ బిల్డింగ్‌లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రకుల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. కాగా మంటలు రాజుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు.

రకుల్ తెలుగులో చివరగా కొండపొలం అనే సినిమాలో నటించింది. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన ‘కొండ‌పొలం’ న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని జాగ‌ర్ల‌మూడి క్రిష్  ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు  ప్రేక్షకుల నుంచి మంకీ స్పందన లభించిన కలెక్షన్లు సాధించడంలో మాత్రం మూవీ విఫలమైందని చెప్పాలి. అలానే రకుల్ ఈ మధ్య కాలంలో బాగా సన్నబడడం కూడా ఆమెకు ఆఫర్లు తగ్గడానికి కారణం అని అంటున్నారు. మొత్తానికి అనుకోని రీతిలో జరిగిన ప్రమాదంలో రకుల్ కు ఏం జరగకపోవడం పట్ల ఆమె అభిమానులంతా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.