Johnny Master జానీ మాస్టర్ కేసులో ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఎంట్రీ.. సంచలన కామెంట్స్..మొత్తం పెంట చేసేసిందిగా..!

ఇలా ఒక్కొక్కరిగా జానీ మాస్టర్ కి సపోర్టుగా ఇండస్ట్రీ కి సంబంధించిన వారు మాట్లాడడం మొదలు పెట్టారు. మరి కేసు లో ఎవరిదీ తప్పు, ఎవరిది ఒప్పు అనేది పోలీసులే తేల్చాలి.

Written By: NARESH, Updated On : September 19, 2024 10:15 pm
Follow us on

Johnny Master సోషల్ మీడియా లో, ఎలక్ట్రానిక్ మీడియా లో గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించే చర్చలు నడుస్తున్నాయి. పోలీసులు నేడు ఆయనని గోవా లో అరెస్ట్ చేసారు. ఇదంతా పక్కన పెడితే శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ పై కేసు పెట్టినప్పుడు ఇండస్ట్రీ ఆయనని చాలా తీవ్రంగా తప్పు పట్టింది. జనసేన పార్టీ నుండి కూడా ఆయనని సస్పెండ్ చేసారు. ఫిలిం ఛాంబర్ సభ్యులు జానీ మాస్టర్ ని కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుండి తప్పించేసాడు. ఇలా అన్ని విధాలుగా జానీ మాస్టర్ కి దారులు మూసుకొని పోయాయి. అలాంటి సందర్భంలో నేడు ఉదయం ఆయనకు సపోర్టుగా మెగా బ్రదర్ నాగ బాబు పరోక్షంగా కొన్ని ట్వీట్లు వేసాడు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్న ఆయన ఇలా మాట్లాడడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కోర్టు నిజా నిజాలు తేల్చే వరకు మీరు వింటున్న వార్తలు నమ్మకండి అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సందీప్ మాస్టర్ సతీమణి జ్యోతి రాజ్ ఈ సంఘటనపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘కొందరు అమ్మాయిలు చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లల కోసం తయారు చేసిన చట్టాలను చాలా తెలివిగా వినియోగిస్తున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకి ఎదిగిన అబ్బాయిలను ఆ చట్టాలతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. జనాలు కూడా ఆరోపణలను గుడ్డిగా నమ్మేయకుండా, రెండు వైపులా ఆలోచించాలి’ అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. మరోపక్క మంచు మనోజ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ‘జానీ మాస్టర్..మీరు జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకి ఎదిగిన వ్యక్తి. మీ మీద ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధేస్తుంది. మిమ్మల్ని మీరు నిజాయితీగా నిరూపించుకొని ఈ కేసు నుండి బయటపడుతారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు నిజంగా తప్పు చేసి ఉంటే దయచేసి లొంగిపోండి’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. అలాగే జానీ మాస్టర్ భార్య సుమలత కూడా మీడియా తో ఈ ఘటన గురించి మాట్లాడింది.

ఆమె మాట్లాడుతూ ’14 ఏళ్ళ నుండి నా భర్త తో కాపురం చేస్తున్నాను. నాకు తెలియదా ఆయన ఎలాంటివాడో. మైనర్ బాలిక పై నా భర్త అత్యాచారం చేసాడని నిరూపిస్తే ఆయనని నేను వదిలేస్తాను. నా భర్త అలాంటి వాడే అయితే నేనెందుకు అతనితో ఇన్నేళ్లు కలిసి ఉంటాను. నా భర్త ఎదుగుదల ని చూసి ఓర్వలేక, కొంతమంది దుర్మార్గులు కావాలని కుట్రలు చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం ఇవ్వగల గొప్ప మనసు ఉన్నోడు నా భర్త’ అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఒక్కొక్కరిగా జానీ మాస్టర్ కి సపోర్టుగా ఇండస్ట్రీ కి సంబంధించిన వారు మాట్లాడడం మొదలు పెట్టారు. మరి కేసు లో ఎవరిదీ తప్పు, ఎవరిది ఒప్పు అనేది పోలీసులే తేల్చాలి.