Drishyam 3 Worldwide Collections: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక సెన్సేషన్ ‘దృశ్యం’. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా , అందుకు సంబంధించిన సీక్వెల్ ని ప్రతీ భాషలోనూ రీమేక్ చేశారు. మొదటి రెండు భాగాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో , మూడవ భాగాన్ని కూడా రీసెంట్ గానే తెరకెక్కించి విడుదల చేశారు. కానీ ‘దృశ్యం 3’ కి ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మొదటి రెండు భాగాల్లో ఉన్న ట్విస్టులు , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ‘దృశ్యం 3’ లో బాగా మిస్ అయ్యాయి అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఆ కారణం చేత ఈ చిత్రానికి అనుకున్నంత స్థాయి ఓపెనింగ్ రాలేదు , కానీ వీకెండ్ మాత్రం చాలా డీసెంట్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని విడుదలకు ముందు 3 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారు మేకర్స్. మొదటి నాలుగు రోజులకు కలిపి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. అది పెద్ద కష్టమేమి కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే , కేరళ నుండి 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు నుండి 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 13 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి 77 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా మొదటి 4 రోజులకు కలిపి ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని చాలా తక్కువకు చేయడం బాగా ప్లస్ అయ్యింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 30 కోట్ల రూపాయలకు జరగ్గా , లాభాలు 33 కోట్ల రూపాయిల వరకు వచ్చాయి. డివైడ్ టాక్ వచ్చిన ఒక సినిమాకు ఈ రేంజ్ లాభాలు రావడం చరిత్రలో ఇదే తొలిసారి , రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలు వస్తాయో చూడాలి.
