Homeఎంటర్టైన్మెంట్Migraine Hangover: మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Migraine Hangover: మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Migraine Hangover: ఈ మధ్య కాలంలో తలనొప్పి వేధిస్తోంది. పని ఒత్తిడి వల్ల వస్తుందా. మైగ్రేన్ తలనొప్పా అనేది తెలియడం లేదు. తలనొప్పి మాత్రం నిత్యం సమస్యలకు గురి చేస్తుంది. పొద్దున లేచిందే మొదలు తలనొప్పి బాధించడం సహజమే. తలనొప్పికి పలు కారణాలు ఉంటాయి. నిద్రలేమితో కూడా తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి లక్షణాలేంటో తెలుసా? అది ఎందుకు వస్తుంది? మైగ్రేన్ తలనొప్పి వల్ల మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తల పట్టేసినట్లుగా అనిపిస్తే ఏ పని చేయాలనే ఆలోచన రాకపోవడం సహజం.

Migraine Hangover
Migraine Hangover

మైగ్రేన్ తలనొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. దీన్ని పార్శ్యపు నొప్పి అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు తల బద్ధలవుతుంది. ఇది ఎందుకు ముంచుకొస్తుందో కూడా అర్థం కాదు. నాడీ కణాలు అతిగా స్పందించడంతో మెదడులో కలిగే సంకేతాలే తలనొప్పిగా చెబుతున్నారు. విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా మనకు తలనొప్పి వస్తుంది. దీంతో ఏం తోచదు. కొన్ని రసాయనాలు విడుదల కావడంతో మెదడులోని రక్తనాళాల్లో వాపు, నొప్పి తలెత్తుతుంది.

ఈ నొప్పి తలకు ఒకే వైపు వస్తుంది. ఒకోసారి ఒక్కో విధంగా కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వికారంగా ఉండటం, వెలుగు చూడలేకపడం వంటి లక్షణాలు మనకు తారసపడతాయి. ఇది ఏ వయసు వారికైనా వస్తుంది. కొందరికి కొన్ని రోజుల వరకు తగ్గిపోదు. ఇంకొందరికి తరచూ వస్తుంటుంది. తలనొప్పి తగ్గాలంటే వ్యాయామం చేయాలి. యోగా కూడా చేస్తుండాలి. ధ్యానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి బాధిస్తుంది.

Migraine Hangover
Migraine Hangover

సరైన సమయానికి భోజనం చేయకపోవడం కూడా ఒక కారణం. తలనొప్పి రాకుండా ఉండాలంటే మన భోజనంలో పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటే మంచిది. జ్వరం వచ్చినప్పుడు పారాసిటమల్ మాత్రలు వేసుకోవద్దు. దీని వల్ల కూడా తలనొప్పి తలెత్తే సూచనలున్నాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పి తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని పాటిస్తూ మనకు తలనొప్పి దరిచేరకుండా చూసుకోవచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version