Covid: దర్శకుడు సురేందర్​రెడ్డికి కరోనా.. క్వారంటైన్​లో ఉంటూ చికిత్స

Covid: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇటీవలే షూటింగ్​ నిమిత్తం హంగేరి వెళ్లిన ఆయన.. ఇంటికి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. కాగా, ఆయతో పాటు, కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించగా.. వారికీ కొవిట్ పాజిటివ్​ నిర్ధరణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా క్వారంటైన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సురేందర్​ రెడ్డి ఏజెంట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 20, 2021 2:17 pm
Follow us on

Covid: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇటీవలే షూటింగ్​ నిమిత్తం హంగేరి వెళ్లిన ఆయన.. ఇంటికి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. కాగా, ఆయతో పాటు, కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించగా.. వారికీ కొవిట్ పాజిటివ్​ నిర్ధరణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా క్వారంటైన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సురేందర్​ రెడ్డి ఏజెంట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమాస్​ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇటీవలె హంగేరిలో కొన్ని ముఖ్యమైన యాక్షన్‌ సీన్స్‌ షూట్​ చేయడం కోసం యనిట్​ మొత్తం వెళ్లింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. కరోనా నుండి కోలుకున్న అనంతరం సురేందర్​ రెడ్డి తిరిగి షూటింగ్​ పనుల్లో బిజీ కానున్నారు. రేసుగుర్రం, కిక్​ వంటి సూపర్ హిట్లు కొట్టిన సురేందర్.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి తీసిన సైరా నరసింహా రెడ్డి సినిమా రికార్డులను నెలకొల్పింది. స్వాతంత్య్రోద్యం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

చిరు 151వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా సినిమాలో చివరి సీన్​ ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించింది. ఆ రేంజ్ ఇంటెన్సిటీలో చూపించారు సురేందర్ రెడ్డి. మరి ఏజెంట్​ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాల్సి ఉంది.