పాత్ర ఏదైనా సరే.. తన వెటకారంతో తన స్పీడ్ మేనరిజంతో ఆకట్టుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే లెక్చరర్ పాత్రలు గుర్తుకువస్తాయి. ఆ పాత్రలకు ఆయన అంత గొప్పగా జీవం పోశారు. ఈ రోజు ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి.
ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను విశేషాలను చూద్దాం. 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో పుట్టారు. ఒంగోలులోని సీఎస్ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పాటు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా కూడా జాబ్ చేశారు.
అయితే జాబ్ పై ఆసక్తి లేకపోవడంతో నాటకాల్లోకి వచ్చారు. ఆ నాటకాల నుంచి కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మలో నటించారు. పైగా ఆ సీరియల్ కి ఆయనే రచయిత, అలాగే ఆయనే దర్శకుడు కూడా. ఆ తర్వాత కాలంలో జంధ్యాల సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఆ తర్వాత ‘బావా బావా పన్నీరు, స్వాతి కిరణం, పరుగో పరుగు, ష్ గప్చుప్, ఓహో నా పెళ్లంట, నువ్వే కావాలి, ఆనందం’ ఇలా అనేక సినిమాల్లో ఆయన ఎన్నో హాస్య పాత్రలు పోషించి మన హృదయాలలో శాశ్వతంగా స్థానాన్ని సంపాధించుకున్నారు.