Anasuya Bharadwaj: సంప్రదాయంగా రంగమ్మత్త .. అనసూయ ఫాలోయింగ్ అటువంటిది మరి..

ప్రస్తుతం అనసూయ నటించిన రజాకార్ సినిమా మార్చి 15న విడుదల కానుంది. అలాగే పుష్ప-2 ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆధునిక వస్త్రాలు ధరించి అనసూయ దిగిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి.

Written By: Suresh, Updated On : February 28, 2024 6:18 pm
Follow us on

Anasuya Bharadwaj: అనసూయ అలియాస్ రంగమ్మత్త తన ప్రయాణాన్ని న్యూస్ యాంకర్ గా ప్రారంభించింది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో బుల్లితెరపై రంగ ప్రవేశం చేసింది. అక్కడ తిరుగులేని స్టార్ అయిపోయింది. సినిమా తారలను ఇంటర్వ్యూ చేసే స్థాయి నుంచి అనే ఒక సినీ తార అయ్యేదాకా ఎదిగింది.. బుల్లితెరపై జబర్దస్త్, డ్రామా జూనియర్స్, ఇంకా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో మెరిసింది.. రంగస్థలం అనే సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించింది.. పుష్ప సినిమాలో సునీల్ సతీమణి దాక్షాయణి పాత్రలో నటించి అలరించింది.

ఇటీవల కాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో బుల్లితెరకు అనసూయ విరామం ప్రకటించింది. అడపాదడపా బుల్లితెరపై మెరుస్తూనే ఉంది. బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాదు సామాజిక మాధ్యమాలలోనూ అనసూయ యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి అభిమానులను అలరిస్తుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటుంది. కొన్ని విషయాల్లో ఆమె వ్యవహార శైలి వివాదాస్పదమైందనే విమర్శలున్నాయి.

ప్రస్తుతం అనసూయ నటించిన రజాకార్ సినిమా మార్చి 15న విడుదల కానుంది. అలాగే పుష్ప-2 ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆధునిక వస్త్రాలు ధరించి అనసూయ దిగిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఆ మధ్య ఓ సముద్రతీరంలో అనసూయ దిగిన ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తిరుపతి వెళ్ళినప్పుడు సంప్రదాయ దుస్తులతో అనసూయ మెరిసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వాస్తు దుకాణం ప్రారంభత్సవానికి అనసూయ వచ్చింది. ఎక్కువ ఆధునిక దుస్తుల్లో కనిపించే ఆమె సంప్రదాయ పద్ధతిలో చీరకట్టుతో కనిపించింది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఫోటోలు దిగేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఆ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన తర్వాత అనసూయ అభిమానులతో ముచ్చటించింది. అనంతరం వారితో సెల్ఫీ దిగింది. అనసూయ ను చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మరోవైపు అనసూయ తమ దుకాణం ప్రారంభోత్సవానికి వస్తుందని నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం చేశారు. అందువల్ల భారీగా అభిమానులు వచ్చారని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక న్యూస్ యాంకర్ గా జీవితాన్ని మొదలుపెట్టి, బుల్లితెరపై స్టార్ గా ఎదిగి, సినిమా తారగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు బిడ్డల తల్లి అయినప్పటికీ కూడా ఆమె ఇంతటి స్టార్ డం సంపాదించుకుందంటే మామూలు విషయం కాదు.